Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై సామూహిక అత్యాచారం.. దుస్తులు లేకుండా రోడ్డుపై పరుగులు

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (16:10 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళను కొందరు కామాంధులు చెరబట్టి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను నగ్నంగా రోడ్డుపై పరుగులు తీయించారు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని బిల్వారా ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తనను కలవాలని ఆ వ్యక్తి కోరాడు. అందుకు ఆ మహిళ నిరాకరించింది. ఈ క్రమంలో ఆ మహిళ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్ళగా, ఆమెను ఫాలో అవుతూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అయితే, ఆ కామాంధుల నుంచి తప్పించుకున్న ఆ మహిళ... శరీరంపై దుస్తులు లేకుండానే నగ్నంగా పరుగెత్తుతూ గ్రామానికి చేరుకుంది. దీన్ని గమనించిన ఆ గ్రామస్థులు ఆ మహిళకు దుస్తులు ఇచ్చి, పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడిన చోటు, గిరిధర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

ఊరెళ్లిన భర్త... గొంతుకోసిన స్థితిలో కుమార్తె... ఉరికి వేలాడుతూ భార్య...

ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె.. పరువు పోయిందని తండ్రి ఆత్మహత్య

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments