Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై సామూహిక అత్యాచారం.. దుస్తులు లేకుండా రోడ్డుపై పరుగులు

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (16:10 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ మహిళను కొందరు కామాంధులు చెరబట్టి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను నగ్నంగా రోడ్డుపై పరుగులు తీయించారు. ఈ అమానవీయ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని బిల్వారా ప్రాంతానికి చెందిన ఓ మహిళకు ఓ వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తనను కలవాలని ఆ వ్యక్తి కోరాడు. అందుకు ఆ మహిళ నిరాకరించింది. ఈ క్రమంలో ఆ మహిళ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వాకింగ్‌కు వెళ్ళగా, ఆమెను ఫాలో అవుతూ వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అయితే, ఆ కామాంధుల నుంచి తప్పించుకున్న ఆ మహిళ... శరీరంపై దుస్తులు లేకుండానే నగ్నంగా పరుగెత్తుతూ గ్రామానికి చేరుకుంది. దీన్ని గమనించిన ఆ గ్రామస్థులు ఆ మహిళకు దుస్తులు ఇచ్చి, పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణానికి పాల్పడిన చోటు, గిరిధర్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

14న ఏపీలో పిడుగులతో కూడిన వర్షమే వర్షం

పటాన‌చెరులో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్!!

Supreme Court: కొమ్మినేనికి బెయిల్- సుప్రీం ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు లాంటిది: జగన్

Ahmedabad: భర్తను కలిసేందుకు లండన్‌కు వెళ్ళిన ఖుష్భూ.. తండ్రితో దిగిన చివరి ఫోటో వైరల్

Kommineni: ఏపీ సర్కారుకు సుప్రీం చీవాట్లు.. కొమ్మినేనికి బెయిల్- విడుదల చేయండి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments