Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్‌ఆర్- కొమరం భీమ్‌కు జోడీ దొరికింది.. ఒలీవియా ఎవరు?

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (16:29 IST)
బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. తారక్ సరసన ఫారన్ బ్యూటీ ఒలీవియా నటించనున్నట్టు మూవీ టీమ్ తెలియజేసింది.
 
ఒలీవియా మంచి థియేటర్ ఆర్టిస్ట్, అన్ని రకాల హావభావాలు, ఎమోషన్స్‌ని బాగా పండించగలదు. పైగా, ఈ మూవీలో ఎన్టీయార్ ప్రేయసి పాత్రకి ఉండాల్సిన అన్ని లక్షణాలు కూడా ఒలివీయాలో ఉండటంతో ఈ రోల్‌కి ఈ బ్యూటీయే ఖరారైనట్లు తెలుస్తోంది. అంతేకాదు ఐరిష్ నటి అలీసన్ డూడీ నెగటివ్ రోల్లో కనిపిస్తుండగా, రేమండ్ స్టీవెన్సన్‌ని కూడా ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారని తెలుస్తోంది.
 
ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

జనవరి నుంచి బైకులన్నింటికీ 'ఏబీఎస్' తప్పనిసరి : కేంద్రం నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments