Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇప్పుడు నా దృష్టి మొత్తం దానిపైనేనంటున్న రాజమౌళి

Webdunia
బుధవారం, 6 మే 2020 (22:24 IST)
దర్సకధీర రాజమౌళి లాక్ డౌన్ సమయంలో ఏదో పెద్ద ప్రాజెక్టే ప్లాన్ చేస్తుంటారని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఎందుకంటే ఖాళీగా ఉంటే మంచి ప్రాజెక్టును ఎంచుకోవడం.. ఆ సినిమాను భారీ విజయంవైపు తీసుకెళ్ళడం రాజమౌళికి ఉన్న అలవాటు. ఆయన ఏ సినిమా చేసినా అది సూపర్ డూపర్ హిట్టే. 
 
అందుకే రాజమౌళిని దర్సకధీరుడని తెలుగు సినీపరిశ్రమలో పొగుడుతుంటారు. ఈ మధ్య మీడియా ముందుకు వచ్చిన రాజమౌళి లాక్ డౌన్ సమయంలో జనం ఇళ్ళలోనే ఉండాలని కోరారు. తాను ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్. సినిమాపైనే దృష్టి పెట్టానని స్పష్టం చేశారు.
 
కానీ ఇన్‌స్టాగ్రాం ద్వారా రాజమౌళికి ఒకటే సందేశాలు పోతున్నాయట. మీలాంటి వారు రామాయణం లాంటి కథను తీసుకుని సినిమా తీస్తే అద్భుతంగా ఉంటుందని అభిమానులు ఒకటే సందేశాలను పంపిస్తున్నారట. దీంతో రాజమౌళి అభిమానుల కోసం ఒక సందేశం తాజాగా పంపాడట. రామాయణం కన్నా నాకు మహాభారతం చేయాలన్న కోరిక ఉంది. 
 
కానీ ఆ ప్రాజెక్టు ఇప్పుడు కాదు. ఆషామాషీగా చేసే ప్రాజెక్టు కాదది. ఇప్పుడు నాకు ఆర్.ఆర్.ఆర్.సినిమా ఎలా పూర్తి చేయాలా అన్న దానిపైనే పూర్తిగా దృష్టి పెట్టాను. ఆ సినిమా గురించే నా ఆలోచన అంతా అంటున్నారట రాజమౌళి.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments