Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య, బోయపాటి మూవీ గురించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్

Webdunia
బుధవారం, 6 మే 2020 (22:09 IST)
నందమూరి నట సింహం బాలకృష్ణ - ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జయ జానకి నాయక చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్య, బోయపాటి కలిసి సింహా, లెజెండ్ చిత్రాలు చేయడం.. ఆ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ కావడంతో వీరిద్దరూ కలిసి హ్యాట్రిక్ మూవీ ఎప్పుడు చేస్తారా..? అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా స్టార్ట్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
 
అయితే.. ఈ సినిమా గురించి ఇప్పుడో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఇందులో బాలయ్యకు సన్నిహితంగా ఉండే పాత్ర ఒకటి ఉందని.. ఆ పాత్రను ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ నవీన్ పొలిశెట్టి పోషిస్తున్నారని వార్తలు వచ్చాయి.
 
అయితే... ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని.. ఆ వార్తలను నవీన్ ఖండిచారు. తాజా వార్త ఏంటంటే... బాలయ్యకు సన్నిహితంగా ఉండే ఆ పాత్రను వంగవీటి, జార్జిరెడ్డి చిత్రాల ఫేమ్ సందీప్ మాధవ్ పోషిస్తున్నారని తెలిసింది. వంగవీటి, జార్జిరెడ్డి చిత్రాలతో సందీప్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.
 
బాలయ్యతో కలిసి నటించే అవకాశం కావడంతో వెంటనే ఓకే చెప్పాడని.. ఈ పాత్ర చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ సినిమాతో సందీప్ మరింతగా ఆకట్టుకుంటాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచంలో భయాందోళనలను సృష్టించిన ఇరాన్ సైనిక సామర్థ్యం

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

తర్వాతి కథనం
Show comments