పబ్‌లో పదిమంది దాడి.. ఎమ్మెల్యే రోహిత్ బంధువులపై రాహుల్ ఫిర్యాదు..

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (14:31 IST)
బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లగింజ్ దాడికి గురైనట్లు వార్తలొచ్చాయి. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌లో జరిగిన ఈ దాడిపై రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రాహుల్.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులపై ఫిర్యాదు చేశాడు. తనతో ఉన్న యువతుల పట్ల వాళ్లు అసభ్యంగా ప్రవర్తించారని, ఇదేంటని అడిగితే.. తనపై బీర్ బాటిళ్లతో దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు. 
 
దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్లు వెల్లడించాడు. న్యాయం జరుగుతుందని తనకు నమ్మకం ఉందని, పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. తాను ఒక్కడినే ఉన్నానని, వాళ్లు పది మంది కలిసి వచ్చి దాడి చేశారని చెప్పాడు. తనతో ఉన్న యువతులపైనా రోహిత్ రెడ్డి బంధువులు దాడి చేశారని చెప్పాడు. 
 
కాగా బుధవారం రాత్రి గచ్చిబౌలిలో ప్రిజమ్ పబ్‌కి తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లగా.. అక్కడ ఆమె పై కొంత మంది యువకులు అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై నిలదీసిన రాహుల్‌పై దాడి జరిగింది. దీంతో అతనని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్

పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు

Chandrababu: ఇండిగో సంక్షోభం.. స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments