Webdunia - Bharat's app for daily news and videos

Install App

పబ్‌లో పదిమంది దాడి.. ఎమ్మెల్యే రోహిత్ బంధువులపై రాహుల్ ఫిర్యాదు..

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (14:31 IST)
బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లగింజ్ దాడికి గురైనట్లు వార్తలొచ్చాయి. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌లో జరిగిన ఈ దాడిపై రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రాహుల్.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులపై ఫిర్యాదు చేశాడు. తనతో ఉన్న యువతుల పట్ల వాళ్లు అసభ్యంగా ప్రవర్తించారని, ఇదేంటని అడిగితే.. తనపై బీర్ బాటిళ్లతో దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు. 
 
దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరినట్లు వెల్లడించాడు. న్యాయం జరుగుతుందని తనకు నమ్మకం ఉందని, పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. తాను ఒక్కడినే ఉన్నానని, వాళ్లు పది మంది కలిసి వచ్చి దాడి చేశారని చెప్పాడు. తనతో ఉన్న యువతులపైనా రోహిత్ రెడ్డి బంధువులు దాడి చేశారని చెప్పాడు. 
 
కాగా బుధవారం రాత్రి గచ్చిబౌలిలో ప్రిజమ్ పబ్‌కి తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి వెళ్లగా.. అక్కడ ఆమె పై కొంత మంది యువకులు అనుచితంగా ప్రవర్తించారు. దీనిపై నిలదీసిన రాహుల్‌పై దాడి జరిగింది. దీంతో అతనని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments