Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూ.ఎన్టీఆర్ విలన్ గుండెపోటుతో కన్నుమూత

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించి, జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన చిత్రం "యమదొంగ". ఈ చిత్రంలో విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా కన్నుమూశారు. ఆయన బుధవారం గుండెపోటు రావడంతో చనిపోయారు.

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (12:07 IST)
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించి, జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన చిత్రం "యమదొంగ". ఈ చిత్రంలో విలన్‌గా నటించిన బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా కన్నుమూశారు. ఆయన బుధవారం గుండెపోటు రావడంతో చనిపోయారు. ఆయన వయసు 55 సంవత్సరాలు. 
 
తన కెరీర్ ప్రారంభంలో మోడలింగ్‌తో పాటు, టీవీ సీరియల్స్‌లోనూ నటించిన ఆయన ఆ తర్వాత పలువురు అగ్రహీరోల చిత్రాల్లో ప్రతినాయకునిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. నరేంద్ర ఝా 2002లో 'ఫంటూష్' అనే చిత్రం ద్వార బాలీవుడ్ వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత 'గదర్', 'రాయీస్', 'మొహంజోదారో' వంటి హిందీ చిత్రాల్లో నటించారు. 
 
తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'యమదొంగ', యువరత్న బాలకృష్ణ చిత్రం 'లెజండ్', హీరో ప్రభాస్ నటించిన 'ఛత్రపతి', తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 'కబాలీ' వంటి తదితర హీరోల చిత్రాల్లో నటించారు.

అలాగే, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా త్వరలో రానున్న హిందీ చిత్రం 'రేస్-3'లో ఆయన విలన్‌ రోల్‌లో కనిపించనున్నారు. కాగా, ఝా మృతిపట్ల పలువురు నటీనటులు, నిర్మాతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments