Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయనతారను కదిలించాడు.. ఇప్పుడేమో విశాల్‌ను పట్టుకున్నాడు.. ఎవరు?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (15:25 IST)
ఇటీవల నయనతారపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి... సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన తమిళ సీనియర్ నటుడు రాధారవి... తాజాగా స్టార్ హీరో విశాల్ గురించి చాలా వ్యంగ్యంగా ట్వీట్ చేయడం జరిగింది.
 
వివరాలలోకి వెళ్తే... ఇటీవల నయనతారను కించపరుస్తూ రాధారవి చేసిన కామెంట్స్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన విశాల్... ‘‘రాధారవి గారూ.. మహిళల గురించి, ముఖ్యంగా ఒక నటిని గురించి మీరు చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. ఒక మహిళ వల్లనే మీరు పెరిగి పెద్దవారయ్యారనే కనీస జ్ఞానం కూడా మీకు లేదు. మహిళలంటే గౌరవం లేని మీరు.. మీ పేరులోని 'రాధ'ను తొలగించి.. 'రవి' అని మాత్రమే పిలుపించుకోండి’’ అంటూ ట్వీట్ చేసాడు.
 
ఈ ట్వీట్‌కి ప్రతిస్పందించిన రాధారవి వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ... "విశాల్‌కి ఏమీ తెలియదు.. కానీ అన్ని విషయాల్లో తల దూర్చుతుంటాడు. 'రాధ' అనేది మా తండ్రిగారి పేరు.. అందుకే అది నా పేరుకు ముందు వచ్చింది" అని ట్వీట్ చేసారు. మొత్తం మీద ప్రశాంతంగా ఉన్న కోలీవుడ్‌లో రాధారవి కారణంగా ఏదో అలజడి రేగబోతోన్నట్లు ఉంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

మహారాష్ట్ర రాజకీయాలు - మహాయుతి కూటమిలో లుకలుకలు

మూత్రంతో కళ్లను సొంతం చేసుకున్న మహిళ..

రోడ్డుపైనే మాసిన బట్టలతో రొమాన్స్ చేసుకున్న యంగ్ లవర్స్.. ఎవరంటే? (video)

బీటెక్ విద్యార్థి ప్రాణాలు తీసిన బెట్టింగ్ యాప్స్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments