Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్.ఆర్.ఆర్. సంగీత శక్తిని మరోసారి లండన్‌లో ప్రదర్శించనున్న కీరవాణి

డీవీ
శనివారం, 2 నవంబరు 2024 (16:55 IST)
RRR Orchestra poster
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్.ఆర్.ఆర్. చిత్రం గ్లోబర్ సినిమాగా ఖ్యాతి సంపాదించింది. అందులో నాటునాటు.. సాంగ్ కు అపూర్వ స్పందన వచ్చింది. విదేశీయులు, క్రికెటర్లు, బిజినెస్ మేన్ లు సైతం ఆ పాటకు సంగీతానికి అనుగుణంగా డాన్స్ లు వేస్తూ సోషల్ మీడియా ద్వారా మరింత హైలైట్ చేశారు. కాగా, ఇప్పుడు మరోసారి కీరవాణి సంగీత టీమ్ ఆర్.ఆర్.ఆర్. కచేరి పేరుతో లండన్ లో ప్రదర్శించనుంది. లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌ లో లైవ్ ఆర్కెస్ట్రా ప్రదర్శనతో  కీరవాణిసిద్ధం చేస్తున్నారు.
 
మే 11, 2025న ఆర్.ఆర్.ఆర్. ఆర్కెస్ట్రా పేరుతో మీముందుకు వస్తున్నాం. అందరం కలుద్దాం అనే కాప్షన్ తో కీరవాణి ప్రకటించారు. ఇందుకు ముందుగా టికెట్లు బుక్ చేసుకోండి అంటూ రాయ్ ఆల్బర్ట్ హాల్.కామ్ పేరుతో ప్రకటన వెలువరించాడు. ఇప్పటికే బాహుబలి పేరుతో అదే హాల్ లో గతంలో ప్రేక్షకులను అలరించారు.  S S రాజమౌళి, సంగీత దర్శకుడు M. M. కీరవాణి మరియు సంగీత సాంకేతిక నిపుణులతో సహా బాహుబలి నుండి RRR యొక్క మొత్తం బృందం తిరిగి కలయనుంది.
 
బాహుబలి-ది బిగినింగ్ లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ప్రదర్శించబడే భారతీయ సినిమా మరియు నాన్-ఇంగ్లీష్ చలనచిత్రం మరియు స్క్రీనింగ్‌తో ఈవెంట్‌లో సంగీత దర్శకుడు ప్రత్యక్ష ప్రసారం చేశారు. అప్పుడు ఎస్‌ఎస్ రాజమౌళి తన సోషల్ మీడియా హ్యాండిల్‌ను తీసుకొని ట్వీట్ చేస్తూ, "మా చిత్రం #బాహుబలి-ది బిగినింగ్‌ను కలిగి ఉన్న మొదటి ఆంగ్లేతర చిత్రం కావడం చాలా ఉత్సాహంగా ఉంది. అక్టోబర్ 19న లండన్‌లోని రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన రాయల్ హాల్ లో స్కోర్ ప్రత్యక్ష ప్రసారం చేయబడింది అని పేర్కొన్నారు. ఇప్పుడు మరోసారి ఆర్.ఆర్.ఆర్.తో ముందుకు రావడం ఆనందంగా వుందని రాజమౌళి తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KCR: కేటీఆర్‌కు వేరు ఆప్షన్ లేదా? బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారా?

బంగారం దొంగిలించి క్రికెట్ బెట్టింగులు : సూత్రధారులు బ్యాంకు క్యాషియర్.. మేనేజరే...

నాగార్జున సాగర్‌లో మా ప్రేమ చిగురించింది : సీఎం రేవంత్ రెడ్డి

ప్రజలను మోసం చేసేవాళ్లు గొప్ప నాయకులు : నితిన్ గడ్కరీ

KCR: సీబీఐకి కాళేశ్వరం కేసు.. కేసీఆర్, హరీష్ రావులు అరెస్ట్ అవుతారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments