Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పుష్ప 2' చిత్ర టికెట్ ధరల పెంపునకు టి సర్కారు అనుమతి

మురళి
శనివారం, 30 నవంబరు 2024 (14:53 IST)
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కి, డిసెంబరు 5వ తేదీన విడుదలకానున్న 'పుష్ప-2' చిత్రం టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే, డిసెంబరు 4వ తేదీ 9.30 గంటల నుంచి బెనిఫిట్ షోతోపాటు అర్థరాత్రి ఒంటి గంట షోకు అనుమతి ఇచ్చింది. 
 
'పుష్ప-2' బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ.800గా ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌లో బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ.800 వసూలు చేసుకోవచ్చని తెలిపింది. అర్థరాత్రి 1 గంట నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. 
 
డిసెంబరు 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంపు, డిసెంబరు 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చింది. అలాగే, డిసెంబరు 17 నుంచి 23 వరకు సింగల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments