Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈడీ ఆఫీసులో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ - టాలీవుడ్‌లో ఉత్కంఠ!

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:53 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మరోమారు తెరపైకి వచ్చింది. గతంలో అనేక మంది వద్ద హైదరాబాద్ నగర పోలీసులు విచారణ జరిపారు. ఇపుడు మరోమారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ జరుపనుంది. ఇందులోభాగంగా తొలుత టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను తొలుత విచారణకు పిలిచింది. 
 
మంగళవారం నుంచి మొత్తం 12 మంది సినీ ప్రముఖులను విచారించనుంది. తొలిరోజున దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ విచారణ కోసం ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉండగా... 10.05 గంటలకే ఆయన వచ్చేశారు. 
 
ఆయనతో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా పూరీ జగన్నాథ్ స్పందించలేదు. కారు దిగిన వెంటనే నేరుగా కార్యాలయంలోకి వెళ్లారు. ఈడీ సిబ్బంది ఆయనను నేరుగా మొదటి అంతస్తులోకి తీసుకెళ్లారు. మీడియాను అనుమతించలేదు. 
 
ఇదిలావుంటే, ఈ డ్రగ్స్ కేసులో విచారణ ఎలా కొనసాగనుంది, ఏయే ప్రశ్నలు అడగబోతున్నారు, పూరీ జగన్నాథ్ ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు అనే విషయాలు ఇప్పుడు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Akbaruddin Owaisi: అసెంబ్లీ గాంధీ భవన్ మారింది... అక్భరుద్ధీన్ ఫైర్ అండ్ వాకౌట్

ఉపాధి కోసం పలు భాషలు నేర్చుకోవాలి.. రాజకీయాలు వద్దు : సీఎం చంద్రబాబు

నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం.. ప్రారంభించిన తెలంగాణ సర్కారు

ఉపాధి హామీ పనుల్లో రూ.250 కోట్ల అవినీతి : డిప్యూటీ సీఎం పవన్

ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరు.. రైలు కిందపడి యువ జంట ఆత్మహత్య? ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

తర్వాతి కథనం
Show comments