Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణతో సినిమా చేయలేకపోయినందుకు బాధపడుతున్నా : పూరీ

హీరో బాలకృష్ణ - డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పైసా వసూల్. ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే, బాలయ్య గురించి పూరీ ఓ కామెంట్స్ చేశారు. "నేను బాలకృష్

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2017 (12:58 IST)
హీరో బాలకృష్ణ - డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం పైసా వసూల్. ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే, బాలయ్య గురించి పూరీ ఓ కామెంట్స్ చేశారు. "నేను బాలకృష్ణ గురించి విన్నాను.. కానీ ఈ సినిమా ద్వారా ఆయన గురించి ప్రత్యక్షంగా తెలుసుకోగలిగాను. ఇంతకాలం బాలకృష్ణతో సినిమా చేయలేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను" అంటూ కామెంట్స్ చేశారు. 
 
తాను బాలకృష్ణకి వీరాభిమానిగా మారిపోయానని అన్నారు. అదేవిషయాన్ని అభిమానులకు మరోమారు గుర్తు చేస్తూ, 'ఐ యామ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎన్బీకే .. ఐ హ్యావ్ 101 ఫీవర్" అంటూ ఈ సినిమా గురించి ప్రస్తావించారు. అంతేకాదు, అచ్చు బాలకృష్ణ మాదిరిగా ఓ పోజు ఇచ్చేసి .. ఆ పోస్టర్‌ను పోస్ట్ చేసి మరింత ఆసక్తిని రేకెత్తించారు. సెప్టెంబరు ఒకటో తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments