ఆ ముగ్గురు హీరోల దెబ్బకు రోజుకి 4 గంటలే నిద్రపోయిన పూజా హెగ్డే...

Webdunia
బుధవారం, 8 మే 2019 (21:31 IST)
పాతరోజుల్లో సూపర్ స్టార్ క్రిష్ణ మూడు షిప్టుల్లో మూడుసార్లు వర్క్ చేసినట్లు విన్నాం. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించదు. అయితే ఇప్పటి హీరోలు రెండు షిప్టులలో పనిచేసినా అది ఒక మూవీకే. అయితే క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం మూడు షిప్టుల్లో మూడు సినిమాల్లో ముగ్గురు సినిమాలతో నటించింది. 
 
దువ్వాడ జగన్నాథం తరువాత పూజా హెగ్డే వరుస ఛాన్సులను అందుకుంది. తెలుగు స్టార్స్ దృష్టి ఈ అమ్మడిపై పడగా ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్‌తో ఒకేసారి జతకట్టే ఛాన్స్ అందుకుంది. ఈ ముగ్గురు హీరోలకు కాల్ షీట్లు ఇవ్వలేక నానా అవస్థలు పడింది పూజా. అరవింద సమేత వీరరాఘవలో ఎన్టీఆర్‌తో నటిస్తూ ఉండగానే మహర్షిలో మహేష్ బాబుతో ఛాన్స్ అందుకుంది. రాధాక్రిష్ణ దర్శకత్వంలో ప్రభాస్ మూవీలోను పూజా హెగ్డే సెలక్టయ్యింది. ఈ మూడు సినిమాల షూటింగ్ ఒకేసారి నడవడం.. ఈ అమ్మడు డేట్స్ ఒకేసారి కావాల్సి  వచ్చింది. 
 
అరవింద షూటింగ్ హైదరాబాద్‌లోను, మహర్షి షూటింగ్ రాజస్థాన్‌లో జరగడంతో ఈ అమ్మడు కోసం నిర్మాతలు ఫ్లైట్స్ బుక్ చేశారు. దీంతో ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ కోసం పూజా హెగ్డే 20 గంటల పాటు కష్టపడిందట. మహర్షి ప్రమోషన్లో ఈ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు అరవింద సమేత వీరరాఘవ షూటింగ్‌లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు మహర్షి సెట్స్‌లో, రాత్రి 9 నుంచి అర్థరాత్రి 2గంటల వరకు ప్రభాస్ మూవీలో కాల్షీట్లు ఇచ్చి అందరికీ న్యాయం చేసింది. 
 
ఈ హడావిడిలో రోజుకు 4 గంటలు మాత్రమే నిద్రపోయిందట పూజా హెగ్డే. మొత్తానికి ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్‌కు దక్కని అరుదైన గౌరవాన్ని వెనకేసుకుంది ఈ క్రేజీ హీరోయిన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు బస్సు ప్రమాదం, డ్రైవర్ బస్సు నడుపుతూ బిగ్ బాస్ చూస్తున్నాడా?

Bapatla, ఇంట్లో అమ్మానాన్నలు ఏమవుతారోనన్న స్పృహ వుంటే ఇలా బైక్ నడుపుతారా, గుద్దేశారు (video)

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. బస్సు ఓనర్ అరెస్ట్

రేవంత్ రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్.. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు: హరీష్

Pawan Kalyan: అధికారుల పనితీరుపై ఏపీ డిప్యూటీ సీఎం తీవ్ర అసంతృప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

తర్వాతి కథనం
Show comments