Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగష్టు 15న ప్రభాస్‌కి త్రిముఖ పోరు తప్పేలా లేదు..! (Video)

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (17:26 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రం ఆగష్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ కేవలం 28 సెకన్ల నిడివి మాత్రమే ఉంది.


ఫస్ట్ సింగిల్ టీజర్ హై వోల్టెడ్ ఎలెక్ట్రిఫైయింగ్ మ్యూజిక్‌తో హుషారెత్తించే విధంగా ఉంది. కాగా జూలై 8న ఫస్ట్ లిరికల్ సింగిల్ విడుదల కానుంది. సినిమా రిలీజ్ టైం దగ్గరపడడంతో ఈ చిత్ర బృందం సినిమాకి సంబంధించి ప్రమోషన్‌ను షురూ చేసారు.
 
ఈ సినిమాతో పాటు బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన మిషన్ మంగళ్, అలాగే జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన బద్లా హౌస్ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. మిషన్ మంగళ్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అంగారక గ్రహంపైకి ఇండియా మామ్ అనే ఉపగ్రహం పంపిన సంగతి తెలిసిందే. దానిని ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. 
 
భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీంతో పాటు అదే రోజున బద్లా హౌస్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఇందులో జాన్ అబ్రహం హీరోగా చేస్తున్నారు. బద్లా హౌస్, సాహో హిందీ మూవీని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. మరి ఈ త్రిముఖపోరులో విజయం సాధించేది ఏ చిత్రమో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments