ఎన్టీఆర్ తర్వాత ఆయనకే క్రేజ్... పవన్‌కు దిష్టి తగలకూడదు.. పృథ్విరాజ్

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (17:30 IST)
హీరో పవన్ కళ్యాణ్ నటించిన "భీమ్లా నాయక్‌"కు వైకాపా నేత, సినీ నటుడు పృథ్విరాజ్ చూశారు. ఆ తర్వాత ఆయన పవన్‌తో పాటు సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలకు, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అప్పట్లో తాను సీనియర్ ఎన్టీఆర్ నటించిన 'అడవి రాముడు' చిత్రాన్ని చూశానని గుర్తుచేశారు. 
 
తన జీవితంలో 'భీమ్లా నాయక్' చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. అప్పట్లో 'అడవి రాముడు' చిత్రాన్ని చూసేందుకు తాడేపల్లిగూడెంలోని విజయా టాకీస్‌కు వెళ్తే అక్కడ భారీగా తరలివచ్చిన అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారన్నారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి క్రేజ్ ఒక్క పవన్ కళ్యాణ్‌కే ఉందన్నారు. 
 
'భీమ్లా నాయక్' క్లైమాక్స్‌తో పాటు రానా, పవన్ కళ్యాణ్ నటించిన సన్నివేశాలు చాలా బాగున్నాయన్నారు. తాను కూడా ఓ ప్రేక్షకుడిగా ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశానని, అదేసమయంలో ఇంత అద్భుతమైన సినిమాలో నటించలేకపోయాననే బాధ తనకు ఉందని, పవన్ కళ్యాణ్‌కు దిష్టి తగలకూడదని కోరుకుంటున్నానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొవ్వూరులో ట్రావెల్స్ బస్సు బోల్తా.. 40మంది ప్రయాణీకులకు ఏమైంది?

శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం దుర్వినియోగం - కేరళ సీఎం వివరణ

Caravan Tourism: ఆంధ్రప్రదేశ్‌లో కారవాన్ టూరిజం.. బాపట్ల, విశాఖలో ట్రయల్

Stray Dogs: ఫిబ్రవరిలో 2.3 లక్షల వీధి కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్

కాంగ్రెస్ ఎమ్మెల్యే బ్యాంకు లాకర్‌లో 40 కేజీల బంగారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments