Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాష్ రాజ్ స్వార్దపరుడు.. నిర్మాత నట్టి కుమార్

ఠాగూర్
సోమవారం, 7 అక్టోబరు 2024 (16:54 IST)
నటుడు ప్రకాష్ రాజ్ స్వార్థపరుడు అని నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం కోసం‌ మాట్లాడుతుంటే, అప్పటి నుంచే ఆయనంటే కొందరికి పడటం లేదన్నారు. ప్రకాష్ రాజ్ ఇష్టం వచ్చినట్లు ఎదెదో మాట్లాడుతున్నాడు. ఆయన స్వార్థపరుడు అన్నారు. ఎనాడన్నా ఇండస్ట్రీ కోసం, ప్రజల కోసం ఎమన్నా చేశావా ప్రకాష్ రాజ్ అని ప్రశ్నించారు. 
 
ప్రజ్వల్ రేవన్న ఇన్సిడెంట్‌పై ప్రకాష్ రాజ్ ఎందుకు స్పందిచలేదన్నారు. రజనీకాంత్ అన్నప్పుడు ఏమి స్పందించలేదన్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరు చెప్పి దేవుడిని అవమానిస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ కాలి గోటికి ప్రకాష్ రాజ్ సరిపోడన్నారు. ఇదంతా డైవర్షన్ కోసం చేస్తున్నట్టుందన్నారు. చిరంజీవిని అవమానించినప్పుడు, ఐదు రూపాయల టికెట్ పెట్టినపుడు, ప్రకాష్ రాజ్ ఎందుకు జగన్‌పై ట్వీట్ చేయలే అన్నారు. 
 
కేసీఆర్ ఇండస్ట్రీ అమ్మాయిలను డ్రగ్స్ పేరుతో నిలబెట్టినపుడు ఎందుకు ట్వీట్ చేయలా, అప్పుడు ఉంది మీ ప్రభుత్వాలే అనే చేయలేదా అని అన్నారు. టిడిపి, పవన్ కల్యాణ్ అధికారంలో ఉంటేనే మీకు ట్వీట్‌లు వెస్తారా అని అన్నారు. రేణు దేశాయ్ ట్రోలింగ్ గురైనపుడు ఇండస్ట్రీ ఎమైందన్నారు. భువనేశ్వరిపై అసభ్యంగా మాట్లాడినపుడు ఇండస్ట్రీ ఎక్కడకు వెళ్లిందన్నారు. 
 
ప్రకాష్ రాజ్ ట్వీట్ ఎందుకు వేయలా, రజినీకాంత్‌పై నీచంగా మాట్లాడితే ఇండస్ట్రీ ఖండన లేదే అన్నారు. జగన్ కేసిఆర్ అంటే మీకు భయమా అని ప్రశ్నించారు. అంజనా దేవిపై పోసాని అసభ్యంగా మాట్లాడితే ఖండన ఏదన్నారు. కొండా సురేఖ మాట్లాడింది తప్పే‌.. ఆవిడ క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. కానీ నాడు వైసిపి వారు, పోసాని మాట్లాడింది నీచాతినీచం అని అన్నారు. 
 
ప్రకాష్ రాజ్ పొలిటికల్‌గా వచ్చి పవన్ కల్యాణ్‌ను ఎదుర్కోవాలన్నారు. అంతేకానీ ఇండస్ట్రీ ముసుగులో ట్వీట్స్ కరెక్ట్ కాదన్నారు. జానీ మాస్టర్‌పై పొక్సో కేసు ఉందని ఇండస్ట్రీ వాళ్లే మెయిల్ పెట్టారు. అందుకే అవార్డ్ రద్దు అయింది.. దీని వెనుక కుట్ర కోణం ఉందన్నారు. నేషనల్ అవార్డ్ అనేది డాన్సర్స్ యూనియన్‌కే గర్వకారణమన్నారు. జానీ మాస్టర్ వ్యవహారంలో అసలు నిజాలు బయటకు వస్తాయి. అతనికి జరిగిన అన్యాయంపై డాన్సర్స్ యూనియన్ గట్టిగా మాట్లాడాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments