Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండేల్‌కు బెనిఫిట్ షోలు లేవు.. అంత బెనిఫిట్ మాకొద్దు : అల్లు అరవింద్

Allu Aravind
ఠాగూర్
గురువారం, 6 ఫిబ్రవరి 2025 (23:06 IST)
అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం తండేల్. ఈ చిత్రం శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం చిత్ర బృందం హైదరాబాద్ నగరంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. 
 
ఇందులో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, 'తండేల్' సినిమా టికెట్ ధరలపై కీలక వ్యాఖ్యలు.. ఏపీలో మాత్రమే తండేల్ టికెట్ ధరలను పెంచాలని అడిగాం.. తెలంగాణలో టికెట్ ధరలను పెంచాలని అడగలేదన్నారు. దీనికి కారణం.. తెలంగాణలో ఇప్పటికే టికెట్ ధరలు పెరిగి ఉన్నాయి.. టికెట్ ధరలు రూ.50 పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరాం.. తెలంగాణలో టికెట్‌ ధరలు రూ.295, రూ. 395 పెరిగాయి.. తండేల్ బెనిఫిట్ షోలు లేవు, అంత బెనిఫిట్ మాకు వద్దు అని చెప్పారు. 
 
ఈ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చయింది. మా వాసుతో పాటు కొంతమంది నా వద్దకు వచ్చి ఎందుకైనా మంచిది సినిమాను ఏరియాల వారీగా అమ్మేద్దామా అని అడిగారు.. నేను సినిమా చూశా.. అమ్మొద్దు.. మనమే విడుదల చేద్దాం అని చెప్పారు. ఈ మూవీ ఈవెంట్‌కు అల్లు అర్జున్ వస్తే ఆయన తర్వాతి చిత్రం లుక్ అందరికీ తెలిసిపోతుందన్న కారణంతోనే రాలేదా అని ప్రశ్నించగా, తండేల్ ఈవెంట్‌‍ వరకే పరిమితం చేద్దాం అంటూ సమాధానాన్ని దాటవేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెజవాడలో భిక్షగాళ్లలా సిమి సంస్థతో సంబంధమున్న ఉగ్రవాదులు?

చకచక సాగిపోతున్న పాకిస్థాన్ జాతీయుల వీసాల రద్దు...

Altaf Lali: లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లాలి మృతి

AP Spouse Pension Scheme: విడో పెన్షన్లు.. ఏపీ మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.. నెలకు రూ.4,000

ఇస్రో మాజీ చైర్మన్ కె.కస్తూరి రంగన్ కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments