Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీరవ్ మోదీతో డీల్ వదిలించుకోవడం ఎలా..? ప్రియాంక చోప్రా మల్లగుల్లాలు

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కొత్త చిక్కొచ్చి పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన ఓ ముంబై బ్రాంచ్‌లో ఏకంగా రూ.11360 కోట్ల కుంభకోణం జరిగింది. ముంబైలోని సదరు బ్రాంచ్‌లో కొన్ని మోసపూరిత, అనధిక

Webdunia
శుక్రవారం, 16 ఫిబ్రవరి 2018 (12:30 IST)
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు కొత్త చిక్కొచ్చి పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన ఓ ముంబై బ్రాంచ్‌లో ఏకంగా రూ.11360 కోట్ల కుంభకోణం జరిగింది. ముంబైలోని సదరు బ్రాంచ్‌లో కొన్ని మోసపూరిత, అనధికారిక లావాదేవీలు జరిగినట్లు పీఎన్‌బీ గుర్తించింది. 
 
ఇంకా బ్యాంకులకు రూ.11 వేల కోట్లకు పైగా ఎగ్గొట్టి.. జనవరి 1న దేశాన్ని విడిచి పారిపోయిన నీరవ్ మోదీతో బ్రాండ్ అంబాసిడర్ డీల్ కుదుర్చుకున్న బాలీవుడ్ సుందరి ప్రియాంక చోప్రా.. ఆ ఒప్పందాన్ని ఎలా రద్దు చేసుకోవాలనే అంశంపై లాయర్ల సలహా తీసుకుంటోంది. 
 
ఈ క్రమంలో గతంలో కుదుర్చుకున్న కాంట్రాక్టును ఆమె ఎలా వదిలించుకోవాలనే దిశగా ప్రియాంక చోప్రా ప్రయత్నిస్తున్నారు. జనవరి 2017 నుంచి నీరవ్ మార్కెటింగ్ చేస్తున్న వివిధ రకాల ఆభరణాలకు ప్రియాంక చోప్రా ప్రచారం సాగిస్తోన్న సంగతి తెలిసిందే. 
 
ఇకపోతే.. భారత్‌లో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తో పాటు మరెన్నో బ్యాంకులను రూ.11 వేల కోట్లకు పైగా మోసం చేసి విదేశాలకు పారిపోయాడు. ప్రస్తుతం అతడు న్యూయార్క్‌లో వున్నట్లు తెలిసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ నిందితుడన్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments