Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌భాస్ నెక్ట్స్ మూవీలో విల‌న్ ఎవ‌రో తెలుసా..?

Webdunia
గురువారం, 26 సెప్టెంబరు 2019 (12:57 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో సినిమాతో స‌క్స‌స్ సాధిస్తాడు అనుకున్నారు కానీ... ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాడు. దీనికి కార‌ణం సాహోలో ప్రభాస్ బాలీవుడ్, కోలీవుడ్ నటులకు ఎక్కువ‌ ప్రాధాన్యత ఇవ్వ‌డ‌మే అని తెలిసింది. భారతదేశం అంతటా ప్రభావం చూపాలని సాహో టీమ్ అలా చేసారు కానీ... ఆ ప్లాన్ వ‌ర్క‌వుట్ కాలేదు. అస‌ల‌కే మోసం వ‌చ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సాహో సినిమాకి భారీగా న‌ష్టాలు వ‌చ్చాయి.
 
అందువల్ల ప్ర‌భాస్ త‌దుప‌రి చిత్రం జాను విష‌యంలో చాలా కేర్ తీసుకుంటున్నాడ‌ట‌. జాను మూవీ పీరియడ్ రొమాంటిక్ డ్రామా. ఈ మూవీలో తెలుగు నటులుకు ప్రాధాన్య‌త ఇవ్వాలి అనుకుంటున్నాడ‌ట‌. అందుక‌నే విల‌న్ పాత్ర కోసం జగపతి బాబును సంప్రదించినట్లు స‌మాచారం. జిల్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
 
ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 20 శాతం షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ విదేశాల్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తిరిగి వ‌చ్చాకా... నవంబర్‌లో కొత్త షెడ్యూల్‌ను తిరిగి ప్రారంభిస్తారు. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని 2020 సమ్మర్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments