Webdunia - Bharat's app for daily news and videos

Install App

చివరి దశకు చేరుకున్న ప్రభాస్ 'ఆదిపురుష్' షూటింగ్

Webdunia
ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (13:13 IST)
ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం "ఆదిపురుష్". ఈ చిత్రం శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్‏గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ లాంగ్ షెడ్యూ్ల్ ముంబైలో ప్రారంభమైంది.
 
ఈ షెడ్యూల్ దాదాపు 25 రోజులపాటు జరుగుతుందని సమాచారం. ఇందులో ముఖ్యంగా క్లైమాక్స్‏లో వచ్చే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేసినట్లుగా సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్‏కు సంబంధించిన రిహార్సల్స్ కూడా ప్రారంభించారట. ముందుగా యాక్షన్ సీన్స్, ఆ తర్వాత టాకీ పార్ట్ చిత్రీకరిస్తారని సమాచారం. 
 
భారీ బడ్జెట్‏తో రూపొందుతున్న ఈ మైథాలజీ ఫిల్మ్‏లో ప్రభాస్ రాముడిగాను, కృతిసనన్ సీతగా కనిపించబోతున్నారు. ఇక రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపిస్తారు. 
 
ఎంతో ప్రతిష్టాత్మాకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది అక్టోబర్ 11న విడుదల చేయనున్నారు. ఇక ప్రభాస్.. పూజాహెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments