Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెట్ స్పీడ్ వేగంతో 'ఆదిపురుష్' షూటింగ్ పూర్తి

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (14:15 IST)
టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్. పాన్ ఇండియా చిత్రంగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావ‌డానికి కొన్నేళ్లు పడుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఈ చిత్రం షూటింగ్‌ను కేవ‌లం 103 రోజుల‌లో పూర్తి చేసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడేలా చేశారు.
 
'ఆదిపురుష్‌ షూట్‌ 103 రోజుల్లో ముగిసింది. ఓ అద్భుతమైన ప్రయాణం గమ్యస్థానానికి చేరుకుంది. మేము క్రియేట్‌ చేసిన మ్యాజిక్‌ని మీతో పంచుకోవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను' అంటూ ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ ఓ ట్వీట్‌లో వెల్లడించారు. 
 
అయితే, ప్రభాస్‌తో ఇంత వేగంగా ఒక సినిమా షూటింగ్ పూర్తి చేయ‌డంపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసిన నెటిజ‌న్స్ అంతే స్పీడ్‌గా మూవీ అప్‌డేట్స్ కూడా ఇవ్వండ‌ని అంటున్నారు. 'ఆదిపురుష్' చిత్రం రామాయణాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కుతుంది. ఇందులో రాముడిగా ప్రభాస్ ఆయ‌న‌కు జోడీగా సీత పాత్రలో నటి కృతిసనన్‌ సందడి చేయనున్నారు. 
 
రామాయణంలో ముఖ్యంగా చెప్పుకునే లంకేశుడి పాత్రను బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, లక్ష్మణుడి పాత్రను సన్నీసింగ్‌ పోషించారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌, ఓంరౌత్‌, ప్రసాద్ సుతార్‌, రాజేశ్‌ నాయర్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. వచ్చే యేడాది ఆగస్టు 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాళ్లపాటికి వాళ్లు చచ్చిపోయారు, మాపాటికి మేము ఖుషీగా చిందులేస్తాం: ఇదీ ఎయిర్ ఇండియా సాట్స్ ఎస్విపి

ప్రియుడు మరో యువతిని పెళ్లి చేసుకున్నాడనీ... భగ్నప్రేమికురాలి బాంబు బెదిరింపులు

పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది.. ఎన్నికల్లో విజయం మాదే : సజ్జల

Airspace ban: గగనతల మూసివేతను జూలై 24 వరకు పొడిగించిన భారత్

LPG: లీక్ అయిన ఎల్పీజీ సిలిండర్.. కాసేపయ్యాక భారీ పేలుడు.. ఆ ఇద్దరికి ఏమైంది..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments