Webdunia - Bharat's app for daily news and videos

Install App

31న మహేష్ - త్రివిక్రమ్ కొత్త చిత్రం అప్‌డేట్... టైటిల్ ఇదేనా?

Webdunia
సోమవారం, 29 మే 2023 (19:21 IST)
టాలీవుడ్ హీరో మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఇది మహేశ్ బాబు నటించే 28వ చిత్రం. ఈ చిత్రం టైటిల్‌ను ఈ నెల 31వ తేదీన అధికారికంగా వెల్లడికానుంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబుకు సంబంధించిన ఓ పవర్ ఫుల్ పిక్‌ను విడుదల చేసింది. ఫుల్ మాస్‌ గెటప్‌లో ఉన్న మహేశ్ బాబు నేలతల్లికి వందనం చేస్తుండటం ఆ ఫోటోలో చూడొచ్చు. 
 
మరో రెండు రోజుల్లో ఎస్ఎస్ఎంబీ 28 నంచి మాస్ ధమాకా వచ్చేస్తుందని చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వెల్లడించింది. మహేశ్ బాబు వీరాభిమానులు ఈ చిత్రం టైటిల్‌ను సినిమా థియేటర్లలో రిలీజ్ చేస్తారని వివరించింది. 
 
కాగా, ఈ మూవీలో మహేశ్ సరసన పూజా హెగ్డే, శ్రీలీలలు నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. అతడు, ఖలేజీ చిత్రాల తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కలయికతో వస్తున్న ఈ చిత్రానికి "గుంటూరు మిర్చి" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments