Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేశ్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌ చేయనంటున్న హీరోయిన్?

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2023 (10:56 IST)
చాలామంది హీరోయిన్లు సినిమాల్లో వచ్చే ప్రత్యేక గీతాల్లో నటించి మంచి పాపులర్ అయ్యారు. ఐటెమ్ పాటలతోనే క్రేజ్ సంపాదించుకొని, లైఫ్‌లో సెటిల్ అయిన కథానాయికలు చాలామందే ఉన్నారు. ఓ సినిమా కోసం నాలుగైదు నెలలు కష్టపడితేరాని పారితోషికాలు, ప్రత్యేక గీతాలతో సంపాదించవచ్చు. అందుకే అగ్ర కథానాయికలు సైతం ఐటెమ్ పాటల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. 
 
పైగా, ఈ తరహా పాటలకు మంచి ఆదరణ ఉండటంతో దర్శక నిర్మాతలు సైతం తమ చిత్రాల్లో ఒక్క ఐటమ్ సాంగ్‌ను ఉంచేందుకు అమితాసక్తి చూపుతూ, ఈ పాటలను బడా హీరోయిన్లతో చేయిస్తున్నారు. అయితే, పూజా హెగ్డే మాత్రం ఓ ఐటెమ్ గీతానికి 'నో' చెప్పిందని టాక్. 
 
ప్రిన్స్ మహేశ్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'గుంటూరు కారం'. ఇందులో ఓ ఐటెమ్ గీతం కోసం పూజాని సంప్రదిస్తే 'నో' చెప్పిందట. కథానాయికగా తనని తప్పించారన్న బాధతోనే పూజా ఇప్పుడు ఐటెమ్ గీతం చేయడం లేదని టాక్. 
 
ఇదివరకు 'రంగస్థలం'లో 'జిగేల్ రాణి'గా మెప్పించిన పూజా.. ఈసారి మహేశ్ సినిమాకి నో చెప్పడం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయింది. అయితే, దీనికి కారణం లేకపోలేదు. నిజానికి గుంటూరు కారం చిత్రంలో హీరోయిన్‌గా తొలుత పూజా హెగ్డేనే సంప్రదించారు. కానీ, కథా పరంగా ఆమెను కాకుండా మరో హీరోయిన్‌ను ఎంపిక చేశారు. ఈ కోపంతోనే ఆమె ఇపుడు ప్రత్యేక గీతం చేయనని చెబుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

ఒక్క సంతకం పెట్టి శ్రీవారిని జగన్ దర్శనం చేసుకోవచ్చు : రఘునందన్ రావు

ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకట రెడ్డి అరెస్టు.. 14 రోజుల రిమాండ్

డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సివస్తుందన్న భయంతోనే జగన్ డుమ్మా : మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments