విచారణకు రావాలంటూ హీరో రాజ్ తరుణ్‌కు పోలీసుల నోటీసులు...

వరుణ్
మంగళవారం, 16 జులై 2024 (14:48 IST)
హీరో రాజ్ తరుణ్‌కు హైదరాబాద్ పోలీసులు నోటీసులు జారీచేశారు. నటి లావణ్యం ఇచ్చిన ఫిర్యాదుతో పాటు ఆధారాలను పరిశీలించిన పోలీసులు.. రాజ్ తరుణ్‌కు కేసు నమోదు చేసి, ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీచేశారు. తెలుగు హీరో రాజ్ తరుణ్, లావణ్య ఎపిసోడ్ ఇపుడు ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్‌కు నార్సింగ్ పోలీసులు నోటీసులు జారీశారు. ఈ నెల 18వ తేదీ లోపు తమ ఎదుట హాజరుకావాలని పేర్కొన్నారు. 
 
కేంద్రం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ చట్టం బీఎన్ఎస్ 45 కింద ఈ నోటీసులు జారీచేశారు. ఇప్పటికే లావణ్య ఫిర్యాదుతో రాణ్ తరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. రాజ్ తరుణ్ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని, దాదాపు పదేళ్లపాటు సహజీవనం చేశాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే.
 
రాజ్ తరుణ్ - లావణ్య - మాల్వీ ఎపిసోడ్.. న్యూట్విస్ట్ 
 
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, ఆయన ప్రియురాలి లావణ్య, యంగ్ హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఎపిసోడ్‌లో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ స్టోరీలోకి మరో కొత్త పాత్ర ప్రవేశించింది. తన కుమారుడు యాగేశ్, మాల్వీ మల్హోత్రా ట్రాప్ చేసి ఆస్తి కాజేసిందని ముంబైకు చెందిన నిర్మాత తల్లి సంచలన ఆరోపమలు చేసింది. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. యాగేశ్, మాల్వీ కాల్ లిస్టు కూడా ఆమె బయట పెట్టారు.
 
ఆ వీడియోలో ఉన్న సారాంశాన్ని పరిశీలిస్తే, యోగేశ్ ముంబైలో ఓ చిన్న నిర్మాత. తన చిత్రంలో నటించడానికి వచ్చిన మాల్వీతో ప్రేమలో తన కుమారుడు ప్రేమలోపడ్డాడు. వీళ్లిద్దరూ రెండేళ్లపాటు సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత ఏమైందో ఏమో, తనని పెళ్లి చేసుకోవడానికి యోగేశ్ నిరాకరించాడనీ, కత్తితో తనపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడనీ ఆరోపిస్తూ మాల్వీ కేసు పెట్టడంతో యోగేశ్‌ను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
నాలుగేళ్లుగా మాల్వీ తమ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతోందని, తప్పుడు కేసులు పెట్టి తన కుమారుడిని జైలుకి పంపించిందని యోగేశ్ తల్లి వెల్లడించారు. రాజ్ తరుణ్, లావణ్య కేసులో మాల్వీ ఇన్వాల్వ్ అయిన విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్నాననీ, అందుకే మాల్వీ బండారం బయటపెట్టాలని వీడియో విడుదల చేస్తున్నాననీ, తన కొడుకు ఇంకా జైలులోనే ఉన్నాడనీ, మాల్వీ అతని కెరీర్‌ను సర్వనాశనం చేసిందని చెబుతూ యోగేశ్ తల్లి బోరున విలపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమార్తెను ప్రేమిస్తున్నాడనీ యువకుడిని చంపేశారు... అయినా శవాన్నే పెళ్లి చేసుకున్న యువతి...

ఇండియన్ టాలెంట్‌తో అమెరికా ఎంతో మేలు జరిగింది : ఎలాన్ మస్క్

Cyclone Ditwah: దిత్వా తుఫాను.. తమిళనాడులో భారీ వర్షాలు

Cyclone Ditwah: దిత్వా తుఫాను బలహీనపడినా.. రెడ్ అలెర్ట్ జారీ.. ఎక్కడ?

Kakinada Ortho Surgeon: ఆపరేషన్ సమయంలో బ్లేడును రోగి శరీరంలో వుంచి కుట్టేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments