Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు' : రాంగోపాల్ వర్మ

Webdunia
ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (15:55 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వివాదాస్ప దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆరోపించారు. తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వచ్చే నెల ఒకటో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు ఆయన విజయవాడలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 
 
కానీ, హోటల్ యాజమాన్యం ఆయన బుక్ చేసుకున్న హాల్‌ను రద్దు చేసింది. దీంతో విజయవాడలోని పైపుల రోడ్డపైనే ఆదివారం రాత్రి 4 గంటలకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయాలని భావించారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చారు. అయితే, ఆయన్ను విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు సమావేశాలకు, సభలు నిర్వహించేందుకు ముందుగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. పైగా, రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఆర్జీవీకి పోలీసులు గుర్తుచేసి ఆయన్ను ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆర్జీవీ స్పందిస్తూ, 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు' అని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పడక సుఖం కోసం అతనికి దగ్గరైంది.. చివరకు అతని వేధింపులతో ప్రాణాలు తీసుకుంది...

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments