Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నాగార్జున సోదరి నాగసుశీలపై కేసు నమోదు

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2023 (16:59 IST)
హీరో అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీలపై హైదరాబాద్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. శ్రీజ ప్రకృతి ధర్మ పీఠం ఆశ్రమంపై నాగసుశీలతో పాటు మరికొందరు కలిసి దాడి చేశారంటూ చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో నాగసుశీలతో పాటు శ్రీనివాస్‌లు సంయుక్తంగా పలు చిత్రాలు నిర్మించడంతో వ్యాపార భాగస్వామిగా కూడా ఉన్నారు. ఈ క్రమంలో వారిమధ్య భూవివాదం కూడా ఉంది. 
 
ఈ క్రమంలో శ్రీనాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్టనర్ చింతలపూడి శ్రీనివాస్, నాగసుశీల మధ్య కొన్నేళ్లుగా భూవివాదాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అయితే, తనకు తెలియకుండానే శ్రీనివాస్ తన భూములను విక్రయించాడని గతంలో పోలీసులకు నాగసుశీల ఫిర్యాదు చేశారు.
 
మరోవైపు, తనను జైలుపాలు చేసైనా తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకోవడానికి తనపై నాగసుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు. నాగసుశీల తనయుడు సుశాంత్‌తో నాలుగు సినిమాలు తీసి భారీగా నష్టపోయామన్నారు. ఈ వివాదాల నేపథ్యంలో నాగసుశీలపై శ్రీనివాస్ తాజాగా ఫిర్యాదు చేయడంతో మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త వేధింపులకు టెక్కీ ఆత్మహత్య... పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావాలని?

తాపీ మేస్త్రిగా మారిన రాహుల్ గాంధీ.. ఎక్కడ? (Video)

ఆరో తరగతి చదువుతున్న బాలికతో యువకుడి పెళ్లి..!!

గన్నవరంలోని గోడౌన్‌లో రూ.2.46 కోట్ల సిగరెట్లు స్వాధీనం

కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్ వద్ద బాలీవుడ్ నటుడు సోనూసూద్..(Video Viral)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments