Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆలయం వద్ద మూత్రవిసర్జన చేయొద్దన్న బాలుడు.. చంపేసిన కిరాతకుడు

kerala boy
, సోమవారం, 11 సెప్టెంబరు 2023 (10:55 IST)
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లాలోని పూవాచల్ ప్రాంతంలో దారుణం జరిగింది. ఓ ఆలయం వద్ద మూత్రవిసర్జన చేయొద్దన్నందుకు ఓ బాలుడిని అత్యంత కిరాతకంగా సమీప బంధువే చంపేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఆగస్టు నెల 30వ తేదీ సాయంత్రం తిరువనంతపురంలోని పూవాచల్ ప్రాంతంలో ఓ హత్య జరిగింది. సైకిలుపై బయటకు వెళ్లామనుకున్న శేఖర్ (15) తన స్నేహితుడితో కలిసి రోడ్డు మీదుకు వచ్చాడు. ఆ సమయంలో వెనుక నుంచి కదలిన కారు శేఖర్ మీదుగా వెళ్లడంతో బాలుడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు మొదట రోడ్డు ప్రమాదంగానే కేసు నమోదు చేశారు.
 
అయితే, కొందరు బంధువుల ఇచ్చిన ఫిర్యాదుతో సీసీ టీవీ విజువల్స్ పరిశీలించగా.. నిందితుడు ప్రియరంజన్ గుట్టు రట్టయింది. ఈ హత్యకు కొన్ని రోజుల ముందు ప్రియరంజన్ స్థానిక ఆలయం వద్ద మూత్రవిసర్జన చేయడాన్ని చూసిన శేఖర్.. అతన్ని నిలదీశాడు. ఆలయం వద్ద మూత్రం విసర్జించరాదంటూ మందలించాడు. దీంతో అతనిపై పగ పెంచుకున్న ప్రియరంజన్... ఈ హత్యకు పాల్పడ్డాడు. దీంతో ప్రియరంజన్‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్: రిమాండ్ రిపోర్టులో నారా లోకేష్ పేరు