పేకాట ఆడిన పెద్దోడు.. చిన్నోడు.. ఎవరా ఇద్దరు హీరోలు?

Webdunia
సోమవారం, 6 నవంబరు 2023 (14:55 IST)
సోషల్ మీడియాలో టాలీవుడ్ హీరోలు వెంకటేష్, మహేష్ బాబులు కలిసి పేకాట ఆడుతున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసిన అనేక మంది మహేష్ బాబు కూడా కార్డ్స్ ఆడతాడా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 
 
స్వతహాగా మహేష్ ఎప్పుడూ ఓపెన్‌గా పార్టీస్‌లో కానీ, వేరే హీరోలతో కలిసి ఎంజాయ్ చేయడమనేది పెద్దగా కనిపించదు. ఎక్కువగా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాడు. ప్రముఖుల పార్టీలకి హాజరైనా చాలా హుందాగా భార్యతో కలిసే హాజరయ్యే మహేష్‌ని పేకముక్కలు, డబ్బు కట్టలతో  చూసేసరికి అందరూ నిజంగానే షాకయ్యారు. 
 
ఈ దృశ్యాలు మహేష్ ఓ ప్రముఖ వ్యాపారవేత్తకు సంబంధించిన క్లబ్ హౌస్ ఓపెనింగ్‌కి విక్టరీ వెంకటేష్‌తో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాజకీయనేతలతో పాటుగా ఫిలిం సెలబ్రెటీలు కూడా పాల్గొన్నారు. అక్కడ మహేష్ - వెంకటేష్ క్లబ్బులో కార్డ్స్ ఆడుతున్న టేబుల్ దగ్గర కనిపించారు.
 
ఆ క్లబ్బు ఓపెనింగ్‌కి వెళ్ళిన మహేష్, వెంకటేష్ అలాగే మరికొంతమందితో కలిసి సరదాగా పేకాట ఆడిన పిక్ అది. అంతేకాని మహేష్ సీరియస్‌గా గేమ్ ఆడింది లేదని తర్వాత అర్థమైంది. కానీ ఆ క్లారిటీ వచ్చేలోపు మహేష్ వెంకటేష్‌లపై రకరకాల ట్రోల్స్ మీమ్స్ షేర్ అయిపోయాయి.
 
ఇక‌ వెంకటేష్ జిగర్ తాండా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, తాను వేరే ఇంపార్టెంట్ కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉందని చెప్పటం, వెంటనే కార్డ్స్ ఆడుతున్న పిక్స్ బయటకు రావటంతో, ఇదేనా ఆ ఇంపార్టెంట్ పని అని నెటిజెన్స్ కామెంట్స్ చేశారు. 
 
చివరికి మహేష్ భార్య నమ్రత సదరు ఈవెంట్‌కు సంబందించిన పిక్స్ షేర్ చేసి వెల్ కమ్ టూ దీవాలి సీజన్ అని.. ప్రీ సెలెబ్రేషన్స్ తరహాలో మెన్షన్ చేయటంతో, ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఇక ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ కూడా పాల్గొన్న పిక్స్‌ను నమ్రత షేర్ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)

యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)

భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments