Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్‌కు ఆస్కార్ అవార్డ్... రుతుక్రమం సమయంలో?

Webdunia
సోమవారం, 25 ఫిబ్రవరి 2019 (13:09 IST)
ఆస్కార్ పండుగ మొదలైంది. ఇందులో భారతీయ డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు లభించింది. ప్రముఖ నిర్మాత గునీత్‌ మోంగా, రేకా జెహతాబ్చి దర్శకత్వంలో నిర్మించిన 'పీరియడ్‌: ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌' సినిమా ఆస్కార్ న్యాయ నిర్ణేత మనస్సును గెలుచుకుంది. తద్వారా అమెరికాలో జరిగే ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఈ అవార్డును ఈ సినిమా గెలుచుకుంది. 
 
భారత్‌లో పలు ప్రాంతాల్లోని అమ్మాయిలు రుతుక్రమం సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులకు మోంగా ఇచ్చిన దృశ్య రూపమే ఈ డాక్యుమెంటరీ. 25 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌ ప్రాంతంలో తెరకెక్కించారు. ఈ  ప్రాంతానికి చెందిన మహిళలు బయోడీగ్రేడబుల్‌ నాప్‌కిన్లు ఎలా తయారు చేస్తారు, వాటిని అతి తక్కువ ధరకు అమ్ముతూ ఇతరులకు ఎలా సాయపడతారని ఈ డాక్యుమెంటరీలో చూపించారు. 
 
ఈ సినిమా ఆస్కార్ గెలుచుకున్న సందర్భంగా దర్శకులు రేకా జెహతాబ్బి మాట్లాడుతూ ఉద్వేగానికి లోనయ్యారు. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యపై తాను డాక్యుమెంటరీ తీస్తే ఆస్కార్‌ అవార్డు వచ్చిందంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు. దీంతో ఈ సినిమా యూనిట్ మొత్తం హర్షం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో ఈ డాక్యుమెంటరీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదుకు బూస్టునిచ్చే కొత్త గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు

ఐర్లాండ్‌లో భారతీయుడిపై జాత్యహంకార దాడి...

గుజరాత్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం - రిక్టర్ స్కేలుపై 3.3గా నమోదు

ఏబీసీడీలు నేర్పించేందుకు నెలకు రూ.21 వేలా?

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు ముందస్తు బెయిల్ రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments