Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాకిస్థాన్‌తో మ్యాచ్.. నిర్ణయం ప్రభుత్వానిదే.. విరాట్ కోహ్లీ

Advertiesment
పాకిస్థాన్‌తో మ్యాచ్.. నిర్ణయం ప్రభుత్వానిదే.. విరాట్ కోహ్లీ
, ఆదివారం, 24 ఫిబ్రవరి 2019 (11:22 IST)
కాశ్మీర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి నిరసనగా భారత్ ఈ మ్యాచ్ ఆడకూడదని అనుకుంటోంది. ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్‌ను బహిష్కరించాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్తాన్‌లో ఉన్న జైషే మహమ్మద్ మిలిటెంట్ సంస్థ ప్రకటించింది.
 
ఈ నేపథ్యంలో ప్రపంచకప్ భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌పై టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పందిస్తూ.. పాకిస్థాన్‌తో ఆడే విషయంపై భారత సర్కారు, బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకున్నా తాము శిరసా వహిస్తామని కోహ్లీ వ్యాఖ్యానించాడు. దేశ ప్రజల అభీష్టం మేరకే తాము నడుచుకుంటామని తెలిపాడు. 
 
ప్రస్తుతానికి ఆస్ట్రేలియా సిరీస్‌పైనే దృష్టి పెట్టామని చెప్పాడు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆప్ఘనిస్థాన్ అదరగొట్టింది.. టీ-20లో ప్రపంచ రికార్డ్.. ఎలా?