Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమేజాన్ ప్రైమ్ కోసం గౌతమ్ మీనన్ వెబ్ ‌సిరీస్

Webdunia
శుక్రవారం, 19 జూన్ 2020 (13:32 IST)
నిర్మాతగా, దర్శకుడిగా రాణిస్తున్న గౌతమ్ మీనన్ తాజాగా అభిమానులకు శుభవార్త చెప్పారు. అమేజాన్ ప్రైమ్ వీడియో కోసం వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. స్టోరీ విషయంలో ఇటీవల చర్చలు జరగగా, అమేజాన్ వారికి నచ్చడంతో వెబ్ సిరీస్‌ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ వెబ్ సిరీస్‌కి పని చేయనున్నారు. 
 
లాక్‌డౌన్ పూర్తైన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుంది. పీసీ శ్రీరామ్ తన ట్విట్టర్ ద్వారా గౌతమ్ మీనన్‌తో కలిసి వెబ్ సిరీస్ చేయనున్నట్టు పేర్కొన్నాడు. ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి జయలలితపై గౌతమ్ మీనన్ తీసిన క్వీన్ వెబ్ సిరీస్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అలాగే లాక్‌డౌన్ సమయంలో త్రిష, శింబు ప్రధాన పాత్రలలో ''కార్తీక్ డయిల్ సయిద ఎన్'' అనే షార్ట్ ఫిల్మ్ తీశాడు. 
 
ఇందులో శింబు, త్రిష మాత్రమే కనిపిస్తారు. ఎవరి ఇళ్లలో వాళ్లు ఉంటూ షూట్ చేసిన షార్ట్ ఫిల్మ్ ఇది. దీనికి రెహమాన్ నేపథ్య సంగీతం అందించడం విశేషం. అభిమానులకు ఓ సినిమా చూసిన అనుభూతిని షార్ట్ ఫిల్మ్‌లోనే కలిగించాడు గౌతమ్ మీనన్. దీంతో గౌతమ్ మీనన్ తీసే తదుపరి వెబ్ సిరీస్‌పై సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్- ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్.. డొనాల్డ్ ట్రంప్

ఇరాన్-ఇజ్రాయేల్ దాడులు.. ఎయిరిండియా కీలక నిర్ణయం.. ఏంటది?

MP: పన్నా జిల్లాలో గనిని తవ్వుతుండగా 2.69 క్యారెట్ల వజ్రం

25న మధ్యాహ్నం 12.01 గంటలకు శుభాంశు శుక్లా రోదసీయాత్ర

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : ఏపీలో విస్తారంగా వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments