Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఓవరాక్షన్ చేయలేదు.. ట్రోల్ చేయడం బాధేసింది.. పాయల్

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (12:25 IST)
పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని సినిమాలే చేసినా.. గ్లామర్ పంట పండించడంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆర్ఎక్స్ 100 చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన పాయల్ రాజ్‌పుత్.. కరోనా వలన కొద్దికాలంగా ఇంటికే పరిమితమైంది. 
 
ప్రస్తుతం షూటింగ్స్ తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటుంది. అయితే సెట్స్‌లోకి అడుగుపెట్టే ముందు పాయల్ కరోనా పరీక్షలు జరిపించుకోగా అందులో నెగెటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ టెస్ట్ చేసే సమయంలో తీసిన వీడియోని షేర్ చేసింది.
 
టెస్ట్ చేసే సమయంలో పాయల్ చాలా భయపడింది. ఇది అంత పెద్ద విషయం ఏమి కాదు, ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదనకుంటా అని పాయల్‌ను ట్రోల్ చేశారు. దీనిపై స్పందించి పాయల్ రాజ్‌పుత్.. నాకు ఇంజక్షన్స్‌, మందులు అన్నా చాలా భయం. కరోనా టెస్ట్ సమయంలోను చాలా భయపడ్డాను, కాస్త అసౌకర్యానికి గురయ్యాను. దీనిపై నన్ను ట్రోల్ చేయడం చాలా బాధగా అనిపించిందని పాయల్ తెలిపింది. 
 
పాయల్ రాజ్‌పుత్ చివరిసారిగా 2020 జనవరి 24 న విడుదలైన డిస్కో రాజాలో కనిపించింది. ఆమె ఏంజెల్ పేరుతో ఒక తమిళ చిత్రం, నరేంద్ర అనే తెలుగు చిత్రంపై పాయల్ సైన్ చేసింది. పాయల్ రాజ్‌పుత్ ఇటీవల ముంబై నుంచి బేస్‌ను హైదరాబాద్‌కు మార్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments