Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనాతో మర్యాద రామన్న నటుడు.. కోసూరి వేణుగోపాల్ మృతి

కరోనాతో మర్యాద రామన్న నటుడు.. కోసూరి వేణుగోపాల్ మృతి
, గురువారం, 24 సెప్టెంబరు 2020 (10:29 IST)
venu gopal
ప్రముఖ సినీ నటుడు, టాలీవుడ్ కమెడియన్ కోసూరి వేణు గోపాల్‌ కరోనా కాటుకు ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారిన పడి చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గత 22 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించిడంతో మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌‌సీఐలో మేనేజర్‌‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.
 
ఉద్యోగం చేస్తూనే సినిమాల మీద మక్కువతో ఆయన సినిమాల్లో నటించేవారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందారు వంటి సినిమాల్లో మంచి గుర్తింపు వచ్చింది. గత 26 ఏళ్ళగా సినిమాల్లో నటిస్తోన్న ఆయన ఎన్నో వందల సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేశారు.
 
వేణుగోపాల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భానుచందర్ హీరోగా 1994లో వచ్చిన తెగింపు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన రాజమౌళి అన్ని సినిమాల్లో ఉన్నారు. మర్యాద రామన్న సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిగ్ బాస్ సీజన్ 4- రోబోలు వర్సెస్ మనుషులు టాస్క్.. హౌస్‌లో రచ్చ రచ్చ