Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి ఒకరి మంచిని కోరుకునే వ్యక్తి కృష్ణంరాజు : పవన్ కళ్యాణ్

Webdunia
ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (15:59 IST)
ప్రతి ఒక్కరి మంచిని కోరుకునే వ్యక్తి రెబెల్ స్టార్ కృష్ణంరాజు అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఆదివారం మృతి చెందిన కృష్ణంరాజు పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణంరాజు కుటుంబ సభ్యులను ఓదార్చారు. హీరో ప్రభాస్‌ను, కృష్ణంరాజు సతీమణిని ఆత్మీయంగా పలుకరించి వారికి ధైర్య వచనాలు పలికారు.
 
అలాగే, సినీ నటి జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ, కృష్ణంరాజు తనను, తన భర్త రాజశేఖర్‌ను సొంత మనుషుల్లా చూసుకునేవారన్నారు. ఆయన గురించి ఎంత చెప్పినా మాటలు సరిపోవని, అంత మంచి మనిషి అని వెల్లడించారు. ఆయనతో తమకు చాలా కాలం నుంచి పరిచయం ఉందని, 'మా' సంక్షోభం సమయంలో ఆయన తనను, రాజశేఖర్‌ను ఇంటిమనుషుల్లా భావించేవారని తెలిపారు. 
 
ఆయనకు 'మా' అంటే ప్రాణం అని, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఏమైపోతుందోనని ఆందోళన చెందేవారని, ఎంతో సిన్సియర్‌గా పనిచేసేవారని జీవిత వివరించారు. 'మా' పరువు మర్యాద కాపాడేందుకు ఎంతో తపించిపోయారని, 'మా' పట్ల ఆయనకు తీవ్రమైన భావోద్వేగాలు ఉండేవని వివరించారు. బయటి వాళ్ల మధ్య పలుచన కాకూడదని 'మా' వాళ్లందరికీ చెబుతుండేవారని జీవిత రాజశేఖర్ గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments