Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవర్ స్టార్ దూకుడు... మరో కొత్త ప్రాజెక్టుపై ఫోకస్!

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (17:34 IST)
జోడు గుర్రాలపై స్వారీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు దూకుడు పెంచాడు. అటు రాజకీయాల్లో, ఇటు సినిమా రంగాలను ఏలేలా ఆయన తన ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇందులోభాగంగా, కొత్త మూవీ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపుతూ సాగిపోతున్నారు. 
 
ఇప్పటికే బాలీవుడ్ చిత్రం పింక్ రీమేక్‌ను తెలుగులోకి వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇపుడు హైదరాబాద్ నగరంలో సాగుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఇంకా ముగియముందే ఆయన దర్శకులు క్రిష్ జాగర్లమూడి, హరీష్ శంకకర్, సురేందర్ రెడ్డిలతో కలిసి పని చేసేందుకు సమ్మతించారు. 
 
తాజాగా పవన్ చేస్తున్న మరో సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడింది. సితార ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. మలయాళంలో హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్'కు రీమేక్‌గా ఈ చిత్రం నిర్మితంకానుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments