Webdunia - Bharat's app for daily news and videos

Install App

వకీల్ సాబ్ బాటలో భీమ్లా నాయక్.. మార్చి 25న ఓటీటీలోకి..!

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (13:08 IST)
Bhimla Nayak poster
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి హీరో రానా కాంబోలో తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్. సితార ఎంటర్‌టైన్‎మెంట్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించాడు. రానా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర తెరకెక్కించారు. 
 
డైరెక్టర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించగా.. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందించారు. ఈ మూవీ గత నెల ఫిబ్రవరి 25న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.  మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్‎గా రూపుదిద్దుకున్న ఈ సినిమా.. ఆత్మ గౌరవానికి అహంకారానికి మధ్య నడిచే పోరుగా తెరకెక్కింది.  
 
తాజాగా ఈ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదలచేయబోతున్నారు. ఈ చిత్ర డిజిటల్ రైట్స్‎ను హాట్ స్టార్ డిస్నీతో పాటు ఆహా కూడా సొంతం చేసుకుంది. భీమ్లా నాయక్‎ను శుక్రవారం మార్చి 25న విడుదలచేస్తున్నట్లు ఆహా ప్రకటించింది.
 
గతేడాది వచ్చిన వకీల్ సాబ్ సినిమాను కూడా విడుదలైన మూడు వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమాను కూడా విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీ బాట పట్టిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments