Publish Date: Wed, 16 Mar 2022 (12:06 IST)
Updated Date: Wed, 16 Mar 2022 (12:08 IST)
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూస్తామన్న పవన్ వ్యాఖ్యలను చూస్తే బాధ అనిపించినా.. నిజం చెప్పినందుకు సంతోషించాలన్నారు. పవన్ ఉద్దేశం చూస్తుంటే తెలుగుదేశం పార్టీతో కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయని రఘురామరాజు అభిప్రాయపడ్డారు.
"వ్యతిరేక ఓట్లు చీల్చనని పవన్ చెప్పారు. బలమైన ప్రతిపక్షాలు కలవాలి. ఇప్పటికే భాజపాతో కలిసి ఉన్నారు. పవన్ ఉద్దేశం ప్రకారం తెదేపాతో కలవచ్చు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం. మూడు పార్టీలు కలిస్తే ప్రజలకు మంచి జరుగుతుందని పవన్ ఉద్దేశం." అన్నారు రఘురామరాజు.