Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన కార్యకర్తలంతా పిచ్చోళ్లు.. రేణూ దేశాయ్

Webdunia
ఆదివారం, 3 మార్చి 2019 (15:05 IST)
జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ జనసైనికులపై నిప్పులు చెరిగారు. జనసేన పార్టీ కార్యకర్తలంతా పిచ్చోళ్ళుగా ఆమె అభివర్ణించారు. పైగా, వారి మాటలు అసలు ఏమాత్రం పట్టించుకోనక్కర్లేదని ఆమె పిలుపునిచ్చారు. 
 
ఆమె ఇటీవల కర్నూలు జిల్లాలో పర్యటించి స్థానిక రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకోసం ఆమె ప్రముఖ టీవీ చానెల్ యాంకర్‌గా మారారు. అదే రోజు పవన్ కళ్యాణ్ కూడా పర్యటించారు. దీంతో పవన్‌కు వ్యతిరేకంగా వైసీపీనే రేణూదేశాయ్‌ని ఉసిగొల్పుతోందంటూ జనసేన కార్యకర్తలు ఆమెపై విరుచుకు పడ్డారు. 
 
ఈ విమర్శలకు రేణూ దేశాయ్ ఘాటుగా స్పందించారు. 'నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వారి మానసిక స్థితిపై నాకు అనుమానాలు ఉన్నాయి' అని అన్నారు. ఇన్నాళ్లు నోటికొచ్చినట్లు మాట్లాడి నన్ను ఇబ్బంది పెట్టారు. ఇకపై అటువంటి వారిని ఉపేక్షించేది లేదు. నాకు ఏ పార్టీలో చేరే అవసరం లేదన్నారు. 
 
పైగా, 'నేను రైతు సమస్యలపై ఓ డాక్యుమెంటరీ షూట్‌ చేస్తున్నాను. అందుకోసమే ఆ రోజు ఓ టీవీ యాంకర్‌గా అవతారం ఎత్తాను. అంతకు మించి ఏమీ లేదు. కానీ జనసేన సైనికులు ఏదో ఊహించుకుని నోటికొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. పిచ్చోళ్లులాగా ప్రవర్తిస్తున్నారు' అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments