Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరుచూరి వెంకటేశ్వర రావుకు సతీవియోగం

Webdunia
శుక్రవారం, 7 ఆగస్టు 2020 (11:23 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కథ, మాటల రచయిత పరుచూరి వెంకటేశ్వర రావుకు సతీవియోగం కలిగింది. ఆయన భార్య విజయలక్ష్మి శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమెకు వయసు 74 యేళ్లు. గుండెపోటుతో ఆమె మరణించినట్టు కుటుంబీకులు తెలిపారు. 
 
విజయలక్ష్మి మృతి విషయాన్ని తెలుసుకున్న పలువురు తెలుగు సినీ ప్రముఖులు పరుచూరి వెంకటేశ్వరరావుకు సంతాపాన్ని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంటికి చేరుకున్న పరుచూరి గోపాలకృష్ణ, సోదరుని ఓదార్చే ప్రయత్నం చేశారు. 
 
అలాగే, విజయలక్ష్మి మరణవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి పరుచూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానభూతిని తెలిపారు. పరుచూరి వెంకటేశ్వరరావు తనకు ఎంతో ఆత్మీయుడని, ఆ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. విజయలక్ష్మి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చిరంజీవి అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

ప్రియురాలని ఇంప్రెస్ చేద్దామనుకుని జైలుపాలైన ప్రియుడు!

Iran: ముగ్గురు సీనియర్ కమాండర్లను హతమార్చిన ఇజ్రాయేల్

హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు - 8 మంది మృత్యువాత

ఎయిరిండియా విమానమా? సిటీ బస్సా? గాల్లో ఎగురుతుండగా కిర్రుకిర్రుమంటూ విమానం తలుపు శబ్దం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments