Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిషకు షాక్... ప్రమోషన్‌కు రాకపోతే.. పారితోషికంలో సగం కట్

Webdunia
ఆదివారం, 23 ఫిబ్రవరి 2020 (11:37 IST)
Trisha
త్రిష తాజాగా నటించిన తమిళ చిత్రం పరమపదం విలయాట్టు. ఈ సినిమా విడుదలకు సిద్ధం కావడంతో సినీ బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమానికి త్రిష రాకపోవటంపై సినీ నిర్మాతల మండలి ఫైర్ అయ్యింది. త్రిష ఈ సినిమాలో నటించి ప్రమోషన్ చేయడానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల్లో సినిమా ప్రమోషన్‌కు రాకపోతే.. త్రిష తీసుకున్న పారితోషికంలో సగం వెనక్కి ఇవ్వాలని హెచ్చరించింది. 
 
కాగా, 24 హౌస్‌ ప్రొడక్షన్స్‌ బ్యానరుపై తిరుజ్ఞానం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పరమపద విళైయాట్టు సినిమాలో త్రిష ప్రధాన పాత్ర పోషించింది. ఈ నెల 28న ఈ సినిమా విడుదల కానుంది. దీంతో ప్రచారంలో భాగంగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను చిత్రబృందం చెన్నైలోని సత్యం థియేటర్‌లో నిర్వహించింది. 
 
అయితే ఈ కార్యక్రమానికి నటి త్రిష హాజరు కాలేదు. ప్రధాన పాత్రలో నటిస్తోన్న త్రిషనే ఈ ప్రచారకార్యక్రమంలో పాల్గొనకపోవడంతో చిత్ర బృందం ఆవేదనకు గురైంది. దీంతో ప్రమోషన్‌కు త్రిష రాకపోతే.. త్రిష పారితోషికంలో సగం వెనక్కి ఇవ్వాలని యూనిట్ హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments