Webdunia - Bharat's app for daily news and videos

Install App

#NTRMahanayakudu - నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ గడపలకు పసుపునై..?

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (19:20 IST)
మహానాయకుడు సినిమా విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తయ్యాయి. ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమాను ఈ నెల 22వ తేదీన విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మహానాయకుడులో రానా పాత్ర హైలైట్ అవుతుందని సినీ పండితులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండో భాగమైన మహానాయకుడు ట్రైలర్ విడుదలైంది. 
 
రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ప్రస్థానం ఈ ట్రైలర్‌లో కంటికట్టినట్లు చూపించారు. ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లడం, ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, ఢిల్లీ రాజకీయాలను ఎదిరించి విధానం ఈ ట్రైలర్‌లో కనిపించింది. 
 
''నిశ్శబ్దాన్ని చేతగానితనం అనుకోవద్దు .. మౌనం మారణాయుధంతో సమానమని మరిచిపోకు'' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అదిరింది. ఇచ్చిన ప్రతి మాటా నిలబడాలి.. చేసిన ప్రతి పనీ కనబడాలి. ఇన్ టైమ్- ఆన్ డోర్ అనే ఎన్టీఆర్ డైలాగ్, చెప్పేటోళ్లు వుండాలి. లేకుంటే ఆరుకోట్ల మంది ఆయన పక్కనున్నా.. ఒంటరోడైపోతాడు.. అని రానా చెప్పే డైలాగ్ బాగుంది.
 
ఇంకా చివరిగా ''నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చా'' అనే మహానాయకుడి ట్రైలర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments