Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనం కోసం జోలె పట్టిన రారాజు కథ : ఎన్టీఆర్ బయోపిక్ రేపే విడుదల

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (11:43 IST)
స్వర్గీయ ఎన్.టి. రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా బుధవారం ప్రేక్షకుల ముందుకురానుంది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి భాగం జనవరి 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. జనం కోసం జోలె పట్టిన రారాజు కథ జనవరి 9వ తేదీన రిలీజ్ అంటూ అందులో పేర్కొంది. 
 
ఇందులో ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు హీరో నందమూరి బాలకృష్ణ నటించారు. ఆయన భార్య బసవతారకంగా విద్యాబాలన్ నటించగా, జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించారు. అలాగే, ఏఎన్నార్ పాత్రలో సుమంత్, చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి, ఇలా అనేక సీనియర్ నటుల పాత్రల్లో యువ నటీనటులు నటించారు. ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమకూర్చారు.
 
ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్స్‌, సాంగ్స్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. 'య‌మ‌గోల' చిత్రంలో ట చిల‌క కొట్టుడు కొడితే చిన్న‌దానా..' సాంగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సాంగ్‌ని ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో వాడుతున్నారు. ఎన్టీఆర్‌గా బాల‌కృష్ణ‌, జ‌య‌ప్ర‌ద‌గా హ‌న్సిక ఆ సాంగ్‌కి స్టెప్పులేయ‌నున్నారు. తాజాగా పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్ అభిమానులని ఆక‌ట్టుకుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments