Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న మెగా హీరోలు.. సమ్మర్‌లో ఫ్యాన్స్‌కు కనువిందే...

మెగా ఫ్యామిలీ హీరోలు టాలీవుడ్‌ను షేక్ చేస్తున్నారు. దశాబ్దకాలం తర్వాత వెండితెరపై రీఎంట్రీకి ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆలరిస్తున్నాడు. చిరంజీవి కంటే

Webdunia
సోమవారం, 30 జనవరి 2017 (16:25 IST)
మెగా ఫ్యామిలీ హీరోలు టాలీవుడ్‌ను షేక్ చేస్తున్నారు. దశాబ్దకాలం తర్వాత వెండితెరపై రీఎంట్రీకి ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నంబర్ 150' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆలరిస్తున్నాడు. చిరంజీవి కంటే ముందుగా ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ "ధృవ"తో ముందుకొచ్చి బంపర్ హిట్ కొట్టాడు. అయితే, వచ్చే సమ్మర్ సీజన్‌లోనూ మాదే హవా అంటున్నారు మెగా ఫ్యామిలీ హీరోలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్‌లు. 
 
హీరో పవన్ నటించిన తాజా చిత్రం 'కాటమరాయుడు'. వచ్చే ఉగాది సందర్భంగా అంటే మార్చి 29వ తేదీన విడుదల కానుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన "డీజే దువ్వాడ జగన్నాథం" మే నెలలో విడుదల కానుంది. తన కెరీర్‌లో అల్లు అర్జున్ బ్రాహ్మణ యువకుని రోల్ ఇందులో పోషించడం విశేషం. 
 
ఇక సాయి ధరం తేజ్ చిత్రం 'విన్నర్' చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇది వచ్చే నెలలో విడుదల కానుంది. వరుణ్ తేజ్ సినిమా "మిస్టర్" మూవీ కూడా వచ్చే ఏప్రిల్ లేదా మే నెలలో రిలీజ్‌కు సిద్ధమైన విషయం తెల్సిందే. ఇలా మెగా హీరోలంతా ఈ వేసవిలో తమ ఫ్యాన్స్‌కు కనువిందు చేయబోతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ.. 600మంది బాధితులా? (video)

Divvala Madhuri: రోజా రీల్స్ చేయట్లేదా? వైకాపా గాలిపార్టీ.. ఫైర్ అయిన దివ్వెల మాధురి

Soap: భార్య సబ్బును వాడిన భర్త.. చివరికి జైలు పాలయ్యాడు.. ఎక్కడో తెలుసా?

పెళ్లైన పది రోజులకే ప్రియుడితో భార్య జంప్.. హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్న భర్త!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments