డ్రగ్స్ డీలర్ కేపీ చౌదరితో లింకు పెట్టొద్దు.. ఎలాంటి సంబంధాలు లేవు : నటి జ్యోతి

Webdunia
ఆదివారం, 25 జూన్ 2023 (15:22 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్‌ దందా కేసులో అరెస్టు అయిన సినీ నిర్మాత కేపీ చౌదరితో తనకు స్నేహం మాత్రమే ఉందని, తమ మధ్య ఎలాంటి డ్రగ్‌ డీలింగ్స్‌ లేవని నటి జ్యోతి క్లారిటీ ఇచ్చారు. నిజానిజాలు తెలుసుకోకుండా తన ఫొటోలు ప్రచురితం చేయొద్దని కోరారు. ఈ మేరకు తాజాగా ఆమె ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్‌ చేశారు.
 
'కేపీ చౌదరి నాకు మంచి మిత్రుడు. మా మధ్య కేవలం పలకరింపులు మాత్రమే ఉండేవి. డ్రగ్స్‌ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఏర్పాటు చేసిన డ్రగ్స్‌ పార్టీలకూ నేను హాజరు కాలేదు. కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. విచారణకు ఒకవేళ నన్ను పిలిస్తే తప్పకుండా వెళ్తా. ఎలాంటి పరీక్షలకైనా రెడీగా ఉన్నా. నేను ఇప్పటివరకూ మత్తుపదార్థాలు వినియోగించలేదు. 
 
నార్కొటిక్‌ టెస్ట్‌కూ రెడీ. అయితే, ఆయన కాల్‌ లిస్ట్‌లో నా పేరు ఉండటంతో పలు మీడియా సంస్థలు నా ఫొటోలు ప్రచురిస్తున్నారు. కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఫొటోలు ఎలా ప్రచురితం చేస్తారు? నాకంటూ ఒక జీవితం లేదా? వాటిని చూసి నా కుటుంబం బాధపడదా? దయచేసి నిజనిజాలు నిర్ధారణ అయిన తర్వాత ఫొటోలు ఉపయోగించండి'  అని జ్యోతి హితవు పలికారు.
 
తెలుగు 'కబాలి' చిత్ర నిర్మాతల్లో ఒకరైన సుంకర కృష్ణప్రసాద్‌ అలియాస్‌ కేపీ చౌదరి ఇటీవల మాదకద్రవ్యాల కేసులో అరెస్టు అయిన విషయం తెల్సిందే. ఈ నెల 14న ఆయన్ని తమ కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన వద్ద నుంచి కొకైన్‌ కొనుగోలు చేసిన వారి జాబితా గూగుల్‌డ్రైవ్‌లో ఉన్నట్టు గుర్తించారు. అలాగే, కేపీ చౌదరి నాలుగు సెల్‌ఫోన్లలో వందల మంది ప్రముఖుల ఫోన్‌ నంబర్లున్నాయి. 
 
వీరిలో సుమారు 20 మందితో నాలుగైదు నెలల నుంచి తరచూ మాట్లాడిన ఫోన్‌కాల్స్‌ వెలుగు చూశాయి. పంజాగుట్టకు చెందిన పుష్పక్‌ క్యాబ్స్‌ యజమాని రతన్‌ రెడ్డి, సినీ నటి అషు రెడ్డి, జ్యోతితో చౌదరి ఎక్కువసార్లు ఫోనులో మంతనాలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే కేపీకి సంబంధించిన డ్రగ్స్‌ వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని శనివారం అషు రెడ్డి స్పందించగా.. తాజాగా జ్యోతి క్లారిటీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రఘు రామ కృష్ణంరాజు కస్టడీ కేసు.. ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌కు నోటీసులు

డ్యాన్సర్‌తో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు.. పిల్లలు, మహిళల ముందే...?

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments