Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా వస్తున్నా... అడుగులో అడుగేస్తా : బండ్ల గణేశ్ ట్వీట్

Webdunia
ఆదివారం, 25 జూన్ 2023 (14:51 IST)
సినీ నిర్మాత బండ్ల గణేశ్ మరోమారు సంచలన ట్వీట్ చేశారు. అన్నా.. వస్తున్నా.. అడుగులో అడుగేస్తా అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆ రాష్ట్రంలో పీపు్ల్స్ మార్చ్ చేపట్టారు. ఇందులో తాను కూడా పాల్గొననున్నట్టు సినీ నిర్మాత బండ్ల గణేశ్ వెల్లడించారు. భట్టిని కలిసేందుకు సూర్యాపేట వెళ్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన్ను ఉద్దేశించి బండ్ల గణేశ్‌ ట్వీట్‌ చేశారు. 
 
'అన్నా.. వస్తున్నా. అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా. కాంగ్రెస్ కోసం.. పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను' అని బండ్ల గణేష్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేశ్‌.. ఆ పార్టీ ఓడిపోవడంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో చైన్ స్నాచింగ్‌ల్లా మొబైల్ స్నాచింగ్‌- నలుగురి అరెస్ట్

బాబూ గారూ రండి.. మాట్లాడుకుందాం... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

భోలే బాబా ఎవరు... సామాజిక మాధ్యమాలకు దూరంగా వుంటారట!

హత్రాస్ తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య.. ఒకేసారి అందరూ..?

ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి.. లేకుంటే ఆ పని చేయండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments