అన్నా వస్తున్నా... అడుగులో అడుగేస్తా : బండ్ల గణేశ్ ట్వీట్

Webdunia
ఆదివారం, 25 జూన్ 2023 (14:51 IST)
సినీ నిర్మాత బండ్ల గణేశ్ మరోమారు సంచలన ట్వీట్ చేశారు. అన్నా.. వస్తున్నా.. అడుగులో అడుగేస్తా అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆ రాష్ట్రంలో పీపు్ల్స్ మార్చ్ చేపట్టారు. ఇందులో తాను కూడా పాల్గొననున్నట్టు సినీ నిర్మాత బండ్ల గణేశ్ వెల్లడించారు. భట్టిని కలిసేందుకు సూర్యాపేట వెళ్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన్ను ఉద్దేశించి బండ్ల గణేశ్‌ ట్వీట్‌ చేశారు. 
 
'అన్నా.. వస్తున్నా. అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా. కాంగ్రెస్ కోసం.. పార్టీ అధికారం కోసం అన్నిటికీ సిద్ధపడి తెలంగాణ అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ అద్భుతమైన పాదయాత్రలో పాలుపంచుకోవడానికి, మిమ్మల్ని కలవడానికి సూర్యాపేటకు వస్తున్నాను' అని బండ్ల గణేష్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన బండ్ల గణేశ్‌.. ఆ పార్టీ ఓడిపోవడంతో క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తాజాగా తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ ట్వీట్‌ చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

వ్యక్తులు రావచ్చు, పోవచ్చు, కానీ టీడీపీ శాశ్వతంగా ఉంటుంది.. నారా లోకేష్

PM Modi Gifts to Putin: పుతిన్‌కు భగవద్గీతను బహూకరించిన ప్రధాని మోదీ

IndiGo: ఇండిగో విమానాల రద్దు.. కేంద్రాన్ని ఏకిపారేసిన రాహుల్ గాంధీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments