Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రానికి ప్రేక్షకుల కరవు... ఫ్రీగా టిక్కెట్ల పంపిణీ.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (12:21 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ఎన్టీఆర్ బయోపిక్'. ఈ చిత్రం తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9వ తేదీ బుధవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటించారు. అలాగే, వివిధ పాత్రల్లో నేటి యువతరం నటీనటులు నటించారు.
 
నిజానికి ఒక కొత్త సినిమా విడుదలవుతుందంటే ఆయా హీరోలు, దర్శకులు, హీరోయిన్ల అభిమానులు ఉదయం నుంచే థియేటర్ల వద్ద సందడి చేయడం ఆనవాయితీ. కానీ, 'ఎన్టీఆర్ కథానాయుడు' చిత్రం ప్రదర్శించే థియేటర్ల వద్ద ప్రేక్షకులు లేక వెలవెలపోతున్నాయి. దీంతో బాలయ్య అభిమానులు థియేటర్ల వద్ద ఉచితంగా టిక్కెట్లను పంపిణీ చేస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఉన్న అలంకార్ థియేటర్‌లో ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను ప్రదర్శించారు. అయితే మొత్తం 400 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ థియేటర్ 200 సీట్లకు మించి నిండలేదు. 
 
దీంతో బాలయ్య అభిమానులు చాలామందికి సినిమా టికెట్లను ఉచితంగా అందజేశారు. దీంతో టికెట్ అందుకున్న ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కల్యాణ్ రామ్, సుమంత్ నరేశ్, విద్యాబాలన్, నిత్యా మీనన్ కీలక పాత్రల్లో నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత రక్షణ వ్యవస్థ... అలనాటి ఆస్ట్రేలియా బౌలర్లలా ఉంది : డీజీఎంవో

తెలంగాణలో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం

యావదాస్తి దానం చేస్తానంటున్న బిల్ గేట్స్ - అద్భుతమైన నిర్ణయమంటూ మెలిండా గేట్స్!!

భారత రక్షణ అధికారులుగా నటిస్తూ సమాచార సేకరణ.. ఆ నెంబర్ నుంచి కాల్స్ వస్తే?

ఆంధ్రలోని 115 చెంచు గిరిజన కుటుంబాలకు సాధికారత: హ్యుందాయ్ ఐయోనిక్ ఫారెస్ట్ ఆగ్రోఫారెస్ట్రీ కార్యక్రమం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments