Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ దెబ్బ‌కు భ‌య‌ప‌డ్డ నితిన్‌!

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (16:42 IST)
Akhil, Nitin
క‌థానాయ‌కుడు నితిన్ మ‌రో క‌థానాయ‌కుడు అఖిల్‌కు భ‌య‌ప‌డుతున్నాడు. ఆయ‌న ఇచ్చిన దెబ్బ అలా ఇలా కాదు. అస‌లేం జ‌రిగింది? ఎందుకు భ‌య‌ప‌డుతున్నాడ‌నేది తెలుసుకోవాలంటే ఆరేళ్ళు వెన‌క్కు వెళ్ళాల్సిందే. లేటెస్ట్‌గా నితిన్ `చెక్‌` అనే సినిమా చేశాడు. విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. నితిన్ స్వంత బేన‌ర్ వుంది. శ్రేష్ట్ మూవీస్ అనేది బేన‌ర్‌.

ఆ బేన‌ర్‌లోనే మొద‌ట్లో త‌న సినిమాలు చేసుకున్నాడు. అలాంటిది బ‌య‌ట హీరోల‌తో కూడా 2015లో `అఖిల్‌` అనే సినిమా చేశాడు. దానికి వి.వి. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆ సినిమా ఫాంట‌సీ క‌థ‌తో కూడుకుంది. సూర్యుడు బేస్‌ మీద క‌థ‌ను అల్లిన ద‌ర్శ‌కుడు బ్ర‌హ్మాండ‌మైన ఫాంట‌సీ వ‌ర్క‌వుట్ అవుతుంద‌నుకున్నారు. ఆ సినిమాలో అక్కినేని అఖిల్ హీరోగా పెట్టారు. ఆ సినిమాకు దాదాపు 40 కోట్లు ఖ‌ర్చ‌యింద‌ని అంచ‌నా.

కానీ ఆ సినిమా విడుద‌ల‌య్యాక ఆద‌ర‌ణ పొంద‌క తిరుగుట‌పా అయింది. పెట్టిన పెట్టుబ‌డి పాయె. ఏం చేయాలో తెలీక ఆ దెబ్బ‌తో సినిమా నిర్మాణం ఆపేశారు. మ‌ళ్ళీ తాజాగా అంటే 2021లో `అంధాదూన్‌` అనే సినిమాతో బేన‌ర్‌ను లైన్‌లో పెట్టారు. ఈసారి  అందులో నితిన్ హీరో. మ‌రి బ‌య‌ట హీరోల‌తో చేసే ఆలోచ‌న వుందా? అని నితిన్‌ను అడిగితే, అయ్య‌బాబోయ్‌.. ఇప్పుడ‌ప్పుడే లేదంటున్నాడు. ఎందుకంటే, అఖిల్ దెబ్బ‌కు ఇంకా కోలుకోలేదు. కొన్నాళ్ళు నిర్మాణం గేప్ ఇచ్చామంటూ తేల్చిచెబుతున్నాడు. మ‌రి త‌ను చెప్పింది కూడా క‌రెక్టే క‌దా.. చూస్తూ చూస్తూ కోట్లు లాస్ అవ్వ‌లేరుగ‌దా. 

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments