Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు.. పలువురు సినీ ప్రముఖులకు ఆహ్వానం

ఠాగూర్
బుధవారం, 28 ఆగస్టు 2024 (15:36 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ చిత్రపరంగ ప్రవేశం చేసి 50 యేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తెలుగు చిత్రపరిశ్రమ స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహిస్తుంది. ఈ వేడుకలకు టాలీవుడ్‌కు చెందిన మరో అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తమిళం, మలయాళం, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన అనేక మంది సినీ ప్రముఖులను తెలుగు సినీ ఇండస్ట్రీ తరపున తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆహ్వానించారు. 
 
బాలకృష్ణ  సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబరు ఒకటో తేదీన హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఈ వేడుకలను నిర్వహించనుంది. ఇందులో శివ రాజ్ కుమార్, కిచ్చ సుధీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, హీరో శివ కార్తికేయన్, దునియా విజయ్, దర్శకులు పి.వాసు, నటుడు నాజర్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్, హీరోయిన్లు సుహాసిని, మీనా, మాలాశ్రీ, సుమలత, రాధిక, రాధ తదితరులు ఉన్నారు. ఈ వేడుకల్లో చిత్రపరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలంతా హాజరుకానున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments