Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరేళ్ల క్రితమే నయనతార - విఘ్నేష్ రిజిస్టర్ మ్యారేజ్! అద్దెగర్భం వివాదానికి ఫుల్‌స్టాప్!

Webdunia
ఆదివారం, 16 అక్టోబరు 2022 (10:00 IST)
అగ్ర నటి నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్‌లు అద్దెగర్భం విషయంలో తమపై వచ్చిన వివాదానికి ఫుల్‌స్టాఫ్ పెట్టినట్టు సమాచారం. వీరిద్దరూ ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారని, గత యేడాది డిసెంబరు నెలలో సరోగసీ (అద్దెగర్భం) విధానం ద్వారా పిల్లలుకనేందుకు నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రిలో తమ పేర్లను నమోదు చేసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మేరకు వారు పక్కా ఆధారాలను తమిళనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రమణ్యం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీకి సమర్పించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
గత జూన్ 9వ తేదీన నిబంధనలకు విరుద్ధంగా వారు సరోగసీ విధానంలో జంట పిల్లలకు తల్లిదండ్రులు కావడంపై దుమారం రేగింది. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మెడికల్‌ అడిషినల్‌ డైరెక్టర్‌ సారథ్యంలో ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా, ఈ కమిటీ విచారణ కూడా చేపట్టింది. ఈ కమిటీ వద్ద నయనతార తన సరోగసీ విధానికి సంబంధించిన పూర్తి ఆధారాలను సమర్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. 
 
ముఖ్యంగా, తాము ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్‌ వివాహం చేసుకున్నట్లుగా ధ్రువీకరించే సర్టిఫికెట్లను నయనతార ఆ కమిటీకి అందించినట్లు సమాచారం. అదేవిధంగా గత డిసెంబరులో అద్దెగర్భం కోసం రిజిస్టర్‌ చేసుకుని ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను విచారణ కమిటీకి వారు సమర్పించినట్టు తెలిసింది. 
 
ఇదిలావుంటే, సరోగసీ విధానం ద్వారా తల్లిదండ్రులు కావాలంటే వివాహమై ఐదేళ్ళు పూర్తి కావాల్సివుంది. భార్య వయస్సు 25 నుంచి 50 యేళ్ళలోపు, భర్త వయస్సు 26 నుంచి 55 యేళ్ళలోపు ఉండాలన్న నిబంధనలు ఉన్నాయి. 
 
నయనతార ఆరేళ్ళ క్రితమే రిజిస్టర్‌ వివాహం చేసుకోవడం వల్ల ఆమె ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని విచారణ కమిటీకి ఆధారాలు సమర్పించినట్టు సమాచారం. నయనతార దంపతులు గత జూన్‌ 9వ తేదీన వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ మైనింగ్ కేసులో వల్లభనేని వంశీకి బెయిలా.. సుప్రీంలో ఏపీ సర్కారు అప్పీల్

ఉత్తర కాశీలో ప్రకృతి విలయం... ముగ్గురు మృతి.. 9 మంది గల్లంతు

న్యూస్ యాంకర్ స్వేచ్ఛ కేసులో కీలక మలుపు.. ఠాణాలో లొంగిపోయిన పూర్ణచందర్

శ్రీవారి భక్తులకు భద్రత.. ప్రతి భక్తుడికి బీమా సౌకర్యం... ఎలా?

విశాఖ ఎక్స్‌ప్రెస్‌లొ దొంగల బీభత్సం... పోలీసుల కాల్పులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం