Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్రోగసీ విధానంలో తల్లిదండ్రులైన నయనతార - విఘ్నేష్ శివన్

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (10:37 IST)
హీరోయిన్ నయనతార - కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌లు మమ్మీడాడీలు అయ్యారు. వీరికి పండంటి మగబిడ్డలు జన్మించారు. గత జూన్ నెల 9వ తేదీన మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఈ జంట కేవలం నాలుగు నెలల్లోనే తల్లిదండ్రులు అయ్యారు. ఇదే విషయంపై విఘ్నేష్ శివన్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"నయనతార, నేను అమ్మానాన్నలమయ్యాం. మాకు కవల పిల్లలు జన్మించారు. ప్రార్థనలు, పూర్వీకుల ఆశీర్వాదాలు, ఈ శుభ విషయాలన్నీ కలిసి దేవుడు మాకు జంట పిల్లలను ప్రసాహించారు. మా ప్రాణానికి, ప్రపంచానికి మీ అందరి ఆశీర్వాదాలు మాకు కావాలి" అని పేర్కొన్నారు. 
 
అయితే, నయనతార ప్రెగ్నెన్సీ కూడా కాలేదు కదా అనుకుంటున్నారా..? సరోగసి పద్ధతిలో విగ్నేష్ శివన్, నయనతార అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఈ జంటకు ఇద్దరూ మగ బిడ్డలు పుట్టారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. తను నయనతార ఇద్దరు అబ్బాయిలకు పేరెంట్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు. 
 
తమ జీవితంలో ఇది ఒక కొత్త చాప్టర్ అంటూ రాసుకొచ్చాడు విగ్నేష్. ఈ మూమెంట్ చాలా ఆనందంగా ఉందని.. నయనతార కూడా ఎంతో సంతోషంగా ఉంది అంటూ చెప్పాడు ఈ దర్శకుడు. తమ ఇద్దరు పిల్లల పాదాలకు ముద్దు పెడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు విగ్నేష్ శివన్. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments