Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడు విఘ్నేష్‌తో గొడవ.. నయనతార బ్రేకప్!

Webdunia
సోమవారం, 6 జనవరి 2020 (12:46 IST)
కోలీవుడ్ హీరోయిన్ నయనతార ప్రేమ మరోమారు పెటాకులయ్యేలా కనిపిస్తోంది. తన ప్రియుడైన కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్‌తో కొనసాగిస్తూ వచ్చిన ప్రేమ వికటించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో వీరిద్దరూ దూరమైనట్టు కోలీవుడ్ వర్గాల సమాచారం. 
 
నిజానికి నయనతారకు లవ్ బ్రేకప్‌లు కొత్తకాదన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎందుకంటే గతంలో శింబు, ప్ర‌భుదేవాల‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన న‌య‌న త‌ర్వాత కొన్ని కారణాలతో వారిద్ద‌రితోనూ విడిపోయింది. నాన్ 'రౌడీదాన్' సినిమా స‌మ‌యంలో డైరెక్ట‌ర్ విఘ్నేశ్ శివ‌న్‌తో న‌య‌న ప్రేమ‌లో ప‌డింది. వీరిద్ద‌రూ డైరెక్ట్‌గా ఎక్కడా త‌మ ప్రేమ వ్య‌వ‌హారం గురించి చెప్పుకోలేదు.
 
కానీ.. ఇన్ డైరెక్ట్‌గా తాము ప్రేమ‌లో ఉన్న‌ట్లు ప‌లు మార్లు తెలియ‌జేశారు. ఇప్పుడు వీరి మ‌ధ్య కూడా దూరం పెరిగింద‌ని టాక్ విన‌ప‌డుతుంది. వీరి గొడ‌వ‌కు కార‌ణం విఘ్నేశ్ శివ‌న్ పెళ్లి ప్ర‌స్తావ‌న తీసుకు రావ‌డ‌మేన‌ట‌. ఇప్ప‌ట్లో పెళ్లి చేసుకోవ‌డం న‌య‌న‌కు ఇష్టం లేద‌ట‌. పెళ్లిపై అయిష్ట‌త‌ను వ్య‌క్తం చేసిన న‌య‌న‌పై విఘ్నేశ్ కోప‌గించుకుని వెళ్లిపోయాడ‌ని గుస‌గుస‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే, ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే నయన్ స్పందించాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

PM Modi: కాట్రా పట్టణం నుండి శ్రీనగర్‌కు వందే భారత్ రైలు సర్వీస్ ప్రారంభం

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments